Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్ రెడ్డి
నవతెలంగాణ శంకరపల్లి
ఈ నెల 27వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు అధికారులకు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్ రెడ్డి అన్నారు. బుధవారం శంకరపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే కౌటింగ్ సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు సెల్ ఫోన్లు తీసుకొస్తే లోపలికి అనుమతి ఉండదనీ అన్నారు. ఉదయం 8గంటలలోపు జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వద్దకు రావాలని సూచించారు. ఎవరైనా తెలియక రెండు సార్లు ఒకే గుర్తుపై వేస్తే ఆ ఓటు చెల్లుతోందన్నారు. ఓటు గుర్తుపై 60 శాతం ఉండి 40 శాతం పక్కన ఉంటే ఆ ఓటు కూడా అకౌంట్లోకి వస్తోందన్నారు. పూర్తిగా ఫలితాలు తెలిసిన తర్వాతనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఫలితాల్లో ఎవరు గెలిచిన, ఓడినా ఎలాంటి ఇబ్బంది కల్గించకుండా మౌనంగా స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో రవీందర్, రిటర్నింగ్ అధికారులు, ఎంపీటీస,జెడ్పీటీసీ పోటీ చేసిన అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : మొయినాబాద్ మండలం పారిషత్ కార్యలయంలో బుధవారం ఎంపీడీవో సుధారాణి ఆధ్వర్యంలో తొలి దశ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోటి చేసిన అభ్యర్థులకు ఓట్ల లెక్కింపుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అభ్యర్థులు సమయానికి రావాలన్నారు. సెల్ఫోన్లు అనుమతించబడదని తెలిపారు. అలాగే ఎన్నికల అధికారులకు అభ్యర్థులు సహకరించాలని సూచించారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి పోటీ చేసిన అభ్యర్థులు ఏజెంట్లతో సహా రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ, ఏఆర్ఓలు షాబాద్ దర్శన్, కాలే శ్రీకాంత్, నాగరాజు, సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
పరిగి : ఈ నెల 27వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు కోసం పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర నెంబర్ 1లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్లను బుధవారం అడిషనల్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఈవో శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ అనురాధ, ఇన్చార్జి ఎంపీడీవో దయానంద్, సీఐ మొగులయ్య, ఎస్ఐ చంద్రకాంత్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.