Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్టీయూ, పీడీఎస్యూ సంఘాల నాయకులు
నవతెలంగాణ - అడిక్మెట్
సాంస్కృతిక ఉద్యమ రథసారథి కే. రామారావు మరణం విప్లవ సాంస్కృతిక ఉద్య మానికి తీరని లోటని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ, పీడీఎస్యూ సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఐఎఫ్ టీయూ జిల్లా అధ్యక్షురాలు పద్మ, హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్సిగుట్టలోని అంబర్నగర్ కట్ట వద్ద అరుణోదయ రామారావు సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి బి ప్రదీప్, రాష్ట్ర కార్యదర్శులు సూర్యం, విరసం నాయకులు విమల సురేష్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ప్రదీప్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి రాములు, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ, నగర కార్యదర్శి లక్ష్మీబాయి పీడీఎస్యూ నగర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఎస్ నాగే శ్వరరావు, మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు, మహేష ్లు మాట్లాడుతూ.. విప్లవ సాంస్కతిక ఉద్యమంలో రథసారధిగా తన జీవిత కాలం రామారావు పని చేశారని గుర్తు చేశారు. అరుణోదయ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న విప్లవ ఉద్యమకారుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వీ కిరణ్, ఏం హనుమేష్, మనం లీల కుమార్, శ్రీనివాస,్ లింగంగౌడ్, నరసింహారెడ్డి మల్లయ్యలు పాల్గొన్నారు.