Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్
మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్య అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. సహాయ ఎలక్షన్ అధికారులకు గురువారం మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, గుండ్లపోచంపల్లి కమిషనర్ అమరేందర్ రెడ్డి, కొంపల్లి కమీషనర్ జ్యోతిలతో పాటు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.