Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఉప్పల్
హబ్సీగూడ డివిజన్లోని కాలనీ నెంబర్-8లో నూతనంగా రూ.15లక్షలతో వ్యాయామ శాల పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి స్థానిక కార్పొరేటర్ బేతి స్వప్నతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శారీరక ధృడత్వానికి,, వ్యాయామశాలలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు.. వ్యాయమశాలలను కాలనీ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో మరి కొన్ని జిమ్లకు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, వనంపల్లి గోపాల్రెడ్డి, శివ, కాలనీవాసులు పాల్గొన్నారు.