Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కత్తితో ఇద్దరు వ్యక్తులపై దాడి
- ఒకరి పరిస్థితి విషమం
నవతెలంగాణ- ఉప్పల్
మద్యం మత్తులో ఓ యువకుడు ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన ఘటన గురువారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం..ధర్మపురి కాలనీకి చెందిన బద్దుల దయాకర్ పాల వ్యాపారం చేస్తుంటాడు. దర్మపురి కాలనీలోని పార్కు సమీపంలో దయాకర్, చిరంజీవి, తరుణ్లు మద్యం తాగి గొడవ పెట్టుకున్నారు. ఇరువురి మధ్య మాట మాట పెరిగి తీవ్రరూపం దాల్చడంతో దయాకర్ తని ఇంటి వద్ద ఉన్న కోడవలితో చిరంజీవి, తరుణ్లపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో చిరంజీవి తీవ్ర గాయాలపాలవ్వగా తరుణ్కు చిన్న గాయాలతో బయటపడ్డాడు. వీరిని వైద్యం కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దయాకర్ వద్ద ఉన్న కత్తిని, అతిడిని అదుపులోకి తీసుకున్నారు. చిరంజీవి, తరుణ్ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.