Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చందానగర్ డివిజన్ను అగ్రగామిగా ఉంచేందుకు కృషి చేస్తున్నానని స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని సురక్ష హిల్స్ కాలనీలో 40 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులను అధికారులు క్వాలిటీ కంట్రోల్ డీఈ లక్ష్మి నర్సింహా, డీఈ ఆనంద్, ఏఈ అనురాగ్ లతో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సురక్ష హిల్స్లో రోడ్డు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ రోడ్డు తో సమస్య పరిష్కారమైందని తెలిపారు. పనులను నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, కాలనీ ప్రెసిడెంట్ ముఖర్జీ, వెంకట్ రామిరెడ్డి, శ్రీనివాస రావు, పోచయ్య, అనంత రెడ్డి తదితరులు ఉన్నారు.