Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
బాచుపల్లి మండలం, నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను మండల రెరెన్యూ అధికారులు కూల్చివేత చేపట్టారు. నిజాంపేట్ పరిధిలోని సర్వే నెంబర్ 191 లో స్వామి నాయుడు అనే వ్యక్తి ప్రభుత్వ స్ధలంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే సర్వే నెంబర్ 79 లో బండారి లే-అవుట్ రోడ్డు నెం.9 లో చివరగా గల తుర్క చెరువు కట్ట వద్ద యానాదిరెడ్డి ప్రక్కనే ఉన్న భవన నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లో చేపడుతున్నట్టు సమాచారం అందుకున్న మండల తహశీల్దార్ ఇటీవల పరిశీలించి అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని నోటీసులు జారీ చేశారు. అయినా అధికారులను దిక్కరించి యాథావిధిగా అక్రమ నిర్మాణం చేస్తుండడంతో గురువారం తహసీల్దార్ నేతృత్వంలో సిబ్బందితో కూల్చి వేతలు చేపట్టారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఆర్ఐ, ఏసీపీ రాజ్కుమార్, టీపీఎస్ శ్రీధర్, వీఆర్ఓ, మండల రెవెన్యూ సిబ్బంది, సాగర్, సంపత్, వీఆర్ఏ తదితరులు పాల్గొన్నారు.