Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
సామాజిక సేవే పరమావధిగా పని చేస్తూ పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు కోల వెంకటేశం ముదిరాజ్. సూరారం చౌరస్తాలో నార్త్ సిటీ హైస్కూల్ నిర్వహిస్తూ తమ పాఠశాలలో చదివే పేద విద్యార్ధులకు ఉచిత విద్యనందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుకు అనేక విధాలుగా ప్రోత్సాహం అంస్తున్నాడు. అందులో భాగంగా గురువారం సూరారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు తన తల్లి సుశీలమ్మ జ్ఞాపకార్ధం 600 నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక సేవలో జీవితాంతం తన వంతుగా సహాయసహకారాలు అందిస్తూనే ఉంటానన్నారు. మానవ సేవే మాధవ సేవగా జీవిస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో లైన్ శ్రీనివాస్రెడ్డి, ఉస్మాన్ భాషా, వినోద్ జాదవ్, అనీల్ దేశారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందం, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.