Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి రవీంద్రాచారి
- ఓటరు లిస్టును సవరించాలి
నవతెలంగాణ-తుర్కయంజాల్
తప్పులు తడకగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేసి రిజర్వేషన్ ప్రకటించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సామభీంరెడ్డి అన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తుర్కయంజాల్ మున్సిపాల్ ఓటరు జాబితా టీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా ఏర్పాటు చేయబడిందన్నారు. ఓసీ ఓటర్లను బీసీ కింద జమచేశారని అగ్రహం వ్యక్తం చేశారు. ఒకే వ్యక్తి పేరు మీద ఉన్న 3,4 ఓట్లు నమోదయ్యాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాగన్నగూడ మాజీ సర్పంచ్లు పూజారి శంకరయ్యగౌడ్, మేతరి అంజయ్య, రేవల్లి యాదగిరి, కాంగ్రెస్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ బీసీ సెల్ అధ్యక్షుడు గోదాసు భద్రయ్య, రాగన్నగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓర్సు శ్రీనివాస్, కోమ్మని పెంటయ్య పాల్గొన్నారు.