Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివిజన్ అధ్యక్షుడు మురుకుంట్ల అరవిందశర్మ
నవతెలంగాణ-మలక్పేట
రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి కృషి చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు మురుకుంట్ల అరవిందశర్మ అన్నారు. గురువారం డివిజన్లోని వాసవీకాలనీలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అథిధి పాల్గొని మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి పాటు పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరును మెచ్చి సభ్యత్వం తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ కొండంత అండగా ఉండి, బీమా కల్పించి ఆపదలో ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామాచారి, గొడుగు శ్రీనివాస్, లింగస్వామిగౌడ్, కొండ్రుశ్రీనివాస్, రాం నర్సింహాగౌడ్, కంచర్ల శేఖర్, జగన్గౌడ్, వల్లూరి రమేష్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు సునితా పటేల్, జహిరా తదితరులు పాల్గొన్నారు.