Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లివ్వడానికి స్థలం లేదు కానీ టీఆర్ఎస్ కార్యాలయాలకు స్థలం కేటాయించడం అధికార దుర్వినియోగానికి పాల్పడడమే అని కేవీపీఎస్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి బంగారు నర్సింగ్రావు అన్నారు. పేద ప్రజలకు ఇండ్లు లేక ఏండ్లనుంచి తరబడి వేచి చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణాలకు భూసేకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అధికార దుర్వినియోగమేనని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు నిధులు కేటాయించకుండా ప్రజాధనం వృథా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.