Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
మల్లాపూర్ డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి అన్నారు. గురు వారం డివిజన్ పరిధిలోని భవానీనగర్, ఎస్వీనగర్, ఓల్డ్ మల్లాపూర్లో పలు అబి óవృద్ధి పనులను, మల్లాపూర్ కార్పోరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానికులు ఎదుర్కో ంటున్న సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తామన్నారు. మల్లాపూర్ డివిజన్ను గ్రేటర్ హైదరాబాద్లోనే ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దే ందుకు ఎమ్మెల్యేగా తన వంతు సహాయ సహాకారం ఉంటుందని తెలిపారు. ప్రధానంగా డ్రయినేజీలు, రోడ్లు, మంచి నీళ్లు వంటి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డీఈ నర్సింగరావు, ఏఈ వేణు, టీఆర్ఎస్ నాయకులు రాపోలు సతీష్, శ్రీని వాస్గౌడ్, ప్రవీణ్, కుంటి కృష్ణ, జీవన్రెడ్డి, రవి, శ్రీను, రమేష్, కిరణ్గౌడ్, విజరు, అశోక్గౌడ్, ధర్మారెడ్డి, విజరుభాస్కర్, బుచ్చమ్మ, అండాలు, సుశీల, ఎల్బారు పాల్గొన్నారు.