Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్యం ఆస్పత్రి చైర్మన్ గుజ్జ సత్యనారాయణ
నవతెలంగాణ-ఎల్బీనగర్
అంతర్జాతీయ ప్రమాణాలతో అతి తక్కువ ఖర్చుకే అత్యున్నత చికిత్సను అందజేస్తున్నామని సత్యం హోమియోపతి చైర్మన్ గుజ్జ సత్యనారాయణ అన్నారు. గురువారం చైతన్యపురిలోని సత్యం హోమియోపతి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆస్పత్రి మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆస్పత్రిలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపులో ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ చేయబడునన్నారు. కార్పొరేట్ స్థాయిలో హోమియో వైద్యులను అందుబాటులో ఉంచేందుకు ఆస్పత్రి స్థాపించడం జరిగిందన్నారు. ఆస్పపత్రి ఆధ్వర్యంలో 10మెడికల్ క్యాంపులను నిర్వహించి దాదాపు 800మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందిస్తామన్నారు. వచ్చే రోగులలో 93శాతం మందికి పైగా విజయవంతమైన చికిత్స పట్ల చాలా సంతోషాన్ని వ్యక్త పరచారని తెలిపారు. డయాబేటిస్, థైరాయిడ్, కీళ్ళవాతం, సొరియాసిస్, వ్యాధులను అత్యుత్తమ చికిత్సను అందజేస్తున్నామన్నారు. మొండి, దీర్ఘకాలిక వ్యాధులు అయినటువంటి హైపటైటిస్, హెచ్ఐవీ వైరస్లకు ప్రత్యేక చికిత్స విధానాన్ని అందజేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాలను, పేద వారికి ఉచిత సేవలు గుర్తింపుగా 2019ఏడాదికి జనవరిలో ఇండియన్ అచివర్స్ అవార్డు (ఐఏఏ)ను బెంగుళూరులో ప్రముఖ సినీ నటి థీయా మిర్జా చేతుల మీదుగా హోమియోపతి బెస్ట్ ఆస్పత్రి ఇన్ హైదరాబాద్ అవార్డును తమ ఆస్పత్రి అందుకోవడం జరిగిందన్నారు. 2025నాటికి హైదరాబాద్, కర్ణాటక, మహరాష్ట్ర, 50కి పైగా బ్రాంచులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.