Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
గత పాలకవర్గం మండల పరిషత్ నిధులను మున్సిపాలిటీలకు కేటాయించిందని వాటిని వెంటనే నిలిపివేయాలని మండల ప్రాదేశిక సభ్యులు కోరారు. గురువారం ఘట్కేసర్ మండల పరిషత్లో నిర్వహి ంచిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ ఏనుగు సుద ర్శన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిధుల అంశం చర్చకురాగా సభ్యులు పైవిధంగా స్పందించారు. గత మండల పరిషత్ పాలక వర్గం చివరి సమయంలో మున్సిపాలిటిల్లో 100 పనులకు తీర్మాణం చేశారని, ఆ పనులు చేసేవరకు ఐదేండ్లు పడుతుందని సభ్యులు ఆంధోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు చేసిన పనులు మినహాయించి ఇకమీదట జరిపే పనులను నిలిపివే యాలని సభ్యులు కోరారు. అట్టి నిధులను గ్రామాలకు కేటాయించాలని సూచించారు. దీనికి ఎంపీపీ ఏనుగు సుధర్శన్ రెడ్డి సభ్యులతో ఏకిభవించినట్టు తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ నుంచి మండలానికి అధిక నిధులు అందేలా కృషి చేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాక్షురాలు కర్రె జంగ మ్మ, ఇన్చార్జి ఎంపీడీవో శశిరేఖ, పంచాయతీ డీఈ సుధాకర్, ఎంపీటీసీలు నీరుడి రమారావు, బొడ్డు వినో ద, పులకంటి భాస్కర్రెడ్డి, గట్టగళ్ళ రవి, కందుల సరళ, సర్పంచ్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.