Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీవీఆర్ విద్యా సంస్ధల చైర్మన్ టి.కోటిరెడ్డి
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
విద్యార్థుల్లో సేవా దృక్పథంతో కూడిన నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందినపుడే భవిష్యత్లో ఉత్తమ నాయకులుగా ఎదుగుతారని టీవీఆర్ విద్యాసంస్థల చైర్మన్ టి.కోటిరెడ్డి తెలిపారు. సుభాష్నగర్ డివిజన్ అపురూపా కాలనీలోని టీవీఆర్ మోడల్ హైస్కూల్లో నిర్వహించిన విద్యార్థి నాయకుల ఎన్నిక పోటీల్లో గెలుపొందిన వారికి గురువారం పాఠశాల డైరెక్టర్ వంశీరెడ్డి ఆధ్యర్యంలో షోల్డర్ ప్లాప్స్, బ్యాడ్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుకు క్రమశిక్షణ, పర్యవేక్షణ బాధ్యతలు పెంపొందించడానికి క్యాబినెట్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల ద్వారా భవిషత్తులో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల విధానం ఎలా ఉంటుందనేది అవగతమౌతుందన్నారు. అలాగే ప్రజాసేవకు అంకితమయ్యే నాయకున్ని ఎన్నుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాన్ని పాఠశాల స్థాయి క్యాబినెట్ ఎన్నికల ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. రానున్న కాలంలో భారత దేశానికి విలువలతో కూడిన యువ నాయకత్వం ఎంతో అవసరమన్నారు. అలాంటి నాయకత్వ లక్షణాలను విద్యార్థిదశ నుంచి అభివృద్ధి చేయడం వల్ల వారిలో దేశసేవ, ప్రజాసేవ చేయాలనే తపన పెరుగుతుందని వివరించారు. అనంతరం క్యాబినెట్ ఎన్నికల్లో గెలుపొందిన హెడ్ బారుగా ఎమ్ ఉమా మహేష్, హెడ్ గర్ల్గా ఐశ్వర్య, డిప్యూటీ హెడ్ బారు ఎస్.భరత్, డిప్యూటీ హెడ్ గర్ల్ టీపీ.సాయినిధి, సీసీఏ కెప్టెన్ బారు ఏ. చాణిక్య, సీసీఏ కెప్టెన్ గర్ల్ ఆసియా జైనాబ్, స్పోర్ట్స్ కెప్టెన్ బారు ఏ.పుష్కర్ , స్పోర్ట్స్ కెప్టెన్ గర్ల్ ప్రైస్ నాన్సీ, ప్రిపెక్ట్ కోఆర్డినేటర్ ఈ. అభినవ్లను అభి నంధించి షోల్డర్ ప్లాప్స్ బ్యాడ్జీలను అందజేశారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ టి వంశీరెడ్డి మాట్లాడుతూ.. తమ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన అంతర్జాతీయ స్థాయి విద్యనందించడంతో పాటు పలు రకాల పోటీ పరీక్షలకు కావాల్సిన విజ్ఞానం పొందడానికి ప్రత్యేక తరగతులు నిర్వహి స్తున్నామని తెలిపారు. ఫ్రీ ప్రయిమరీ స్థాయి నుంచి చిన్నారులను మానసిక ఒత్తిడి లేకుండా ఆటపాటలతో విద్యనందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.