Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్చరల్ వార్తలు
దేశంలో యానిమేషన్ రంగం అభివృద్ధి చెందుతోందని, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ టి.పాపిరెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో గురువారం క్రియేటివ్ మల్టీమీడియా 21వ వార్షికోత్సవం విద్యార్థుల ఆటపాటల మధ్య సందడిగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాపిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉన్నదని తెలిపారు. క్రియేటివ్ మల్టీమీడియా సంస్థ నుండి 26వేల మంది విద్యార్థులు శిక్షణ పొంది విజువల్ ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పనిచేయడం అభినందనీయమన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఇప్పటి వరకు విద్యార్థులు ఆసక్తిచూపుతున్నారని, యానిమేషన్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఇమేజీ టవర్ను ఏర్పాటు చేసిందని, ఎంటర్టైన్మెంట్, యానిమేషన్ రంగాల అభివృద్ధికి దోహదపరుస్తుందని ఆయన తెలిపారు. స్వాగతం పలికిన సంస్థ సీఈఓ రాజశేఖర్ బుగ్గవీటి మాట్లాడుతూ.. మూడు సూత్రాలతో తమ విద్యాసంస్థను నిర్వహిస్తున్నామని, ప్రపంచంలో 'అత్యుత్తమైన దాన్ని పొందు.. తిరిగి ఇవ్వు.. జయం పొందు.. జయాన్నివ్వు.. కష్టపడి పనిచేయు.. అనేవని ఆయన అన్నారు. వేదికపై జేఎన్ఏఎఫ్ఏయూ ఉపాధ్యక్షులు కవితా దర్బానీ, యండీ.ఆఫ్ఎరీనా, అనిల్పంత్ పాల్గొన్నారు.