Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
జల్పల్లి మున్సిపాలీటీ పరిధిలోని షాహిన్నగర్ కాలనీ సహా మరికొన్ని కాలనీలు గత 2నెలలుగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యుసుఫ్ పటేల్ తన సొంత నిధులతో వాటర్ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. గురువారం షాహిన్నగర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత రెండునెలలుగా పలు కాలనీల్లో భూగర్బజలాలు అడుగంటిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీటీ సమస్య తీర్చాలని కాలనీ వాసులు మున్సిపాలిటీ అధికారులను ఎంత వేడుకున్నా అధికారులు మాత్రం నీటిని సరఫరా చేయలేదన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశం మేరకు తన సొంత వ్యవసాయ పొలంలో ఉన్న బోరు మెటర్తో నీటిని ట్యాంకర్ల ద్వారా కాలనీవాసులకు సరఫరా చేయడం జరిగిందన్నారు.