Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నార్త్జోన్ డీసీపీ కల్మేశ్వర్
నవతెలంగాణ - బేగంపేట
మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకొని ఆలయ చుట్టు పక్కల ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు చేశామని నార్త్జోన్ డీసీపీ కల్మేశ్వర్ అన్నారు. గురువారం మహాంకాళి పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ.. ఈసారి పండుగకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని, నిత్యం 2500 పోలీసులు తమ విధులు నిర్వహిస్తారని చెప్పారు. అమ్మవారి దర్శనం కోసం అంజలి థియేటర్ నుంచి ఒక జనరల్ లైన్, వీఐపీ లైన్ వస్తుందని, గుడి వెనుక భాగం నుంచి దాతలు క్యూలైన్లు ఉంటాయన్నారు. పాత రాంగోపాల్పేట పీఎస్ నుంచి నుంచి బోనం లైన్, జనరల్ లైను , బాటా నుంచి బోనం లైన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. బందోబస్తు అంతా డీసీపీ పర్యవేక్షణలో ఉంటుందని, వీఐపీలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేందుకు బార్కోడ్ల ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వినోద్, సీఐ జైపాల్రెడ్డి, ఎస్ఐలు మురళి, మాధవరెడ్డి, గోపాల్రావు అనేక మంది పోలీసులు పాల్గొన్నారు.