Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడాలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో 2019 నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ను నిర్వహించారు. ఈపోటీలు సెప్టెంబర్ 21 నుంచి 22వరకు నిర్వహించారు. ఈ పోటీల్లో 12 రాష్ట్రాల నుంచి 800 మంది బాలబాలికలు పాల్గొన్నారు. 80మంది అధికారులు, కోచ్లు, నిర్వాహకులు హాజరయ్యారు. దక్షిణ ఆసియా అధ్యక్షులు భారత్ శర్మ, మహేష్ కుమార్ గౌడ్ టీఎస్ కేడీఏ పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ భఖి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీమతి విజయ భవాని నిర్వహించారు. ఈ పోటీలను అన్ని వయసుల వారికి నిర్వహించారు. తెలంగాణ కరాటే అసోసియేషన్, కరాటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మార్గదర్శకత్వంలో నిర్వహిచారు. ఫైనల్గా నిర్వహించిన పోటీల్లో అండర్-16, బాలుర పోటీలలో మొదటి స్థానంలో బ్లాక్ బెల్ట్ను, కుమిట్ సొంతం చేసుకున్నారు. రెండో స్థానాన్ని నిచ్చల్ సొంతం చేసుకున్నారు. అండర్ 14 బాలికల విభాగంలో బ్లాక్ బెల్ట్ ను ఫస్ట్ ప్లేస్ లో నమ్రత, రెండవ ప్లేస్లో దీపిక, మూడో స్థానంలో మాధవి గెలుపొందారు.