Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
బంజారాహిల్స్లో ఎన్కేఎం గ్రాండ్ హోటల్లో ఆదివారం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఎన్జీవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీకే రెడ్డి నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా జేడీ లక్ష్మీనారాయణ, మాజీ సీబీఐ అధికారి మురళి, ఐఏఎస్ ఆఫీసర్ డీజీ ఆఫ్ తెలంగాణ స్టేట్, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ. పట్నాయక్ వివిధ ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అంకురి మురళి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అవినీతి అంతమొందించడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వ అధికారుల వేతనాలు పెంచి అవినీతిని ప్రోత్సహించకుండా నిజాయితీగా పని చేయాలన్నారు. పీవీకే రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం మన దేశంలో అవినీతి నల్లధనం ఆన్లైన్లో చలమణి అవుతుందన్నారు. దీని నిర్మూలనకు థర్ట్ పార్టీ విషయంలో సరైన ఆడిటింగ్ నిర్వహిస్తే పూర్తిస్థాయిలో అవినీతిని నిర్మూలించవచ్చన్నారు. జేడీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. భారత్లో 90శాతం మంచివారు ఉన్నారు కానీ సంఘటితంగా లేరన్నారు. ఎనిమిది శాతం దుర్మార్గులు ఉన్నారు కానీ సంఘటితంగా ఉన్నారన్నారని హితవుపలికారు. రెండు శాతం మంచి వారు సంఘటితంగా ఉన్నారు కాబట్టి అవినీతిని అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఫౌండర్ రాజేంద్ర పలనాటి మాట్లాడుతూ.. నిజాయితీగా ప్రశ్నిస్తే సమాధానాలు లభించవని అలసిపోకుండా మార్గదర్శకంగా ఉంటే ఎప్పటికైనా సమాధానం లభిస్తుందన్నారు. ఆ ప్రయత్నంలోనే భాగంగా తాము ఎన్జీవోను 2010లో ప్రారంభించామన్నారు. ప్రస్తుతం 40శాతం మంది భారతీయులు తమ ఆర్గనైజేషన్లో భాగస్వాములయ్యారని చెప్పారు. పబ్లిక్ ఆఫీసర్లు 80మంది తమతో కలిసి పని చేస్తున్నట్టు గుర్తుచేశారు.