Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
రైతుల సంక్షేమంతో పాటు ప్రజలకు అన్ని రకాల రుణాలు అందించి వారిని ఆదుకునేందుకు హైదరా బాద్ రైతు సేవా సహకార సంఘం బ్యాంకు కృషి చేస్తు ందని చైర్మన్ పెత్తుల పుల్లారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాదర్గూల్ గ్రామంలో బ్యాంకు సర్వసభ్య సమావేశం చైర్మన్ పుల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం లో రైతులు పలు సమస్యలను విన్నవిస్తూ.. రైతు సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరుకా వాలని కోరారు. అనంతరం చైర్మన్ పుల్లారెడ్డి మాట్లాడు తూ.. రైతులు, ప్రజల సహకారంతో బ్యాంకు అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత 8నెలలలుగా రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదని దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. బ్యాంకులో రూ.11కోట్ల 50లక్షల డిపాజిట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. రూ.1కోటి 68లక్షల రూపాయలకు రైతులకు పంటరుణాలు ఇచ్చామన్నా రు. అదేవిధంగా రూ.10కోట్ల 92లక్షల రూపాయలను వ్యాపారులకు, డైరిఫామ్, పాలీహౌజ్, బైకు, చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చామన్నారు. రైతులు, గ్రామ ప్రజలు బ్యాంకులో డిపాజిట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ ఏనుగు వెంకట్రెడ్డి, మాజీ ఎంపీటీసి రాంరెడ్డి, బ్యాంకు సభ్యులు లింగమయ్య, మల్లేష్, శంకర్రెడ్డి, చంద్రకళ, యాదిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మోహన్రెడ్డి, అంజయ్య, బ్యాంకు మేనేజర్ నారాయణరెడ్డి, మాదన్నపేట బ్యాంకు మేనేజర్ శిరిష, సిబ్బందిరైెతులు పాల్గొన్నారు.