Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మలక్పేట
అంగన్వాడీలకు త్వరలో పదోన్నతులు
నవతెలంగాణ-మలక్పేట
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులను కల్పిస్తానని తెలంగాణ స్త్రీ, శిశుసంక్షేమశాఖమంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. ఆదివారం టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్లు మంత్రిని తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న అంగన్వాడీ టీచర్లకు త్వరలోనే ప్రమోషన్లు కల్పించాలని వారు కోరారు. స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో పదోన్నతులకు అవసరమైన పోస్టుల రీ ఆర్గనైజేషన్ చేయాలని, కాంట్రాక్టు సూపర్వైజర్ల క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేసి శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తెలివాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా టీఎన్జిఓ నాయకులు శ్రీనివాస్రెడ్డి, గిరి, ఈశ్వర్, టీఎన్జిఓ ఐసిడియస్ ఫోరం నాయకులు పున్నారెడ్డి, వెంకటరమణారెడ్డి, ముఖీద్, నవీన్, అరుణ, స్వరూప, బాలారాజ్, వినరుకుమార్ తదితరులు పాల్గొన్నారు.