Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
వామపక్ష ప్రజా ఉద్యమాలతో హక్కులను సాధించుకుందామని, దీనికి ప్రజలు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలమల్లేష్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యు లు ఆందోజీ రవీంద్రాచారి అన్నారు. ఆదివారం పెద్దఅ ంబర్పేట్లోని ఇందిరాగార్డెన్లో మండల నిర్మాణ మూడో మహాసభను మండల కార్యదర్శి ముత్యాల యాదిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి అతిథిగా వారు హజరై మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఒరగబెట్టి ందేమీ లేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన తెలంగాణ కుటుంబపాలనలో బంధీ అయిం దన్నారు. ఏ హక్కుల కోసం కొట్లాడినమో ఆ హక్కులు టీఆర్ఎస్ ప్రభుత్వం కాలగర్భంలో కలిపిందన్నారు. అలాగే కేందంలో బీజేపీ అధికారంలోకి వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఉన్న ఉద్యోగాలను పీకేసిందన్నారు. రైతే రాజు అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు రైతును ఉరితాళ్లకు వేలాడ దీస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు పక్కన ఉన్న రైతుకు సాగు నీరు అందించిన దాఖలాలు లేవన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరుకు ప్రజా ఉద్యమాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు. రైతాంగానికి, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం కమ్యూనిస్టు పార్టీ అంచెలంచె లుగా పోరాటం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే బల మైన ప్రజా ఉద్యామాలను నిర్వహించి దేశంలో మోడీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి వామపక్షప్రజా తంత్ర శక్తులను ఒక్క తాటిపైకి కూడగట్టడానికి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమా లు నిర్వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు, ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు లక్ష్మణ్, మండల కార్యవర్గ సభ్యులు హరిసింగ్నాయక్, వేణుగోపాలచారి, శేఖర్, నర్సింహా, నవనీత, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.