Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్చరల్ రిపోర్టర్: అక్కినేని జన్మదిన సందర్భం గా శారదా మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో ఆదివారం తేటతేట తెలు గులా.. తెల్లవారి వెలుగులా.. శీర్షికన సినీగీత విభావరి నిర్వహిం చారు. శారద, సాయిపావని, మహేశ్ తదితరులు పాడిన సినీ గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి పాల్గొని మాట్లాడుతూ.. తెలుగు సినీ పాటకు ఘంటసాల స్వరం జీవం కాగా అక్కినేని నటన వరమని తెలిపారు. యువ కళా వాహిని అధ్యక్షులు వైకే.నాగేశ్వర్రావు, శంకరం వేదిక అధ్యక్షులు వై.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్న సభలో ప్రముఖ గాయకుడు సీహెచ్.త్రినాథరావును
కరకాల క్రిష్ణారెడ్డిని సత్కరించారు.