Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమీర్పేట
రెండేండ్లుగా పెండింగులో ఉన్న రేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని సీపీఐ(ఎం) బోరబండ డివిజన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సర్కిల్-07, ఖైరతాబాద్ సివిల్ సప్లయిస్ అధికారి శ్రీనాథ్కు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2019 ఏప్రిల్ 9న రాష్ట్ర సివిల్ సప్లయిస్ చైర్మెన్ గతేడాది జూన్, జూలైలోపు రేషన్ కార్డులను జారీ చేస్తామని హమీనిచ్చారని తెలిపారు. అయితే 2018-2019కి సంబంధించిన రేషన్ కార్డులు ఇప్పటి వరకు లబ్దిదారులకు అందలేదని పేర్కొన్నారు. అసలు కార్డుల జారీలో జాప్యం ఎందుకు జరుగుతుందో తెలియడంలేదన్నారు. అంతేకాకుండా రేషన్ షాపుల్లో సబ్సిడిగా పంచదార, గోధుమలు, కిరోసిన్, ఇతర నిత్యావసరాలకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్డులను త్వరగా జారీ చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జోన్ కన్వీనర్ రాపర్తి అశోక్, ప్రజా సంఘాల నాయకుడు సీపీఎం టి.సాయిశేషగిరిరావు, అలీ ఖాన్, విష్ణుమూర్తి, తిరుపతయ్య, రాజేశ్వరి, స్వామిదాసు పాల్గొన్నారు.