Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో విద్యుత్ దీపాలు లేక కాలనీలు అందకారంగా మారాయని, మున్సిపాలిటీ వైస్ చైర్మెన్ ఫర్హానానాజ్ అన్నారు. మం గళవారం మున్సిపాలిటీ పరిధిలోని అన్ లైౖన్ కాలనీలో వీధిదీపాలను ఏర్పాటు చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పాలకవర్గంలేక కాలనీల్లో ప్రజా సమస్యలను పట్టించుకునే నాధుడు కరువయ్యారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మన్సిపాలిటీలో రోడ్లు, డ్రయినేజీలు, వీధిదీపాలు, తాగునీటి సమస్య ఉందని, రాష్ట్ర విద్యాశాఖమంత్రి పటోళ్ల సబితాఇంద్రారెడ్డి సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. రానున్న వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఏలాంటీ తాగు నీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో యూసుఫ్పటేల్ పాల్గొన్నారు.