Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
విద్యపై దృష్టి సారిస్తేనే విజయ తీరానికి చేరు తా మని శ్రీ వంశీదర్ పాఠశాల కేబీఆర్ ఎడ్యూ కేషనల్ సోసైటీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ వెంకట్రెడ్డి అన్నారు. మం గళవారం బడంగ్పేట మున్సిపల్ కార్పొ రేషన్ పరిధి నాధర్గుల్లోని శ్రీ వంశీధర్ పాఠ శాలల్లో ఏ ర్పాటు చేసిన వార్షికోత్సవ వేడకలకు ఆయన హాజరై జ్యోతి ప్ర జ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ యన మాట్లాడుతూ.. విలువలతో కూడిన విద్యా బో ధన ద్వారా విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని చేరితే స మాజంలో మంచి గుర్తింపు లభిస్తున్నదన్నారు. బట్టి చ దువులతో వచ్చే మార్కుల కోసం కాకుండా, కష్టపడే తత్వాన్ని పిల్లలకు అలవర్చాలని తల్లిదండ్రులకు సూ చించారు. గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో అ త్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని సాయిశ్రీ, స్టార్ స్టూడెంట్ ఆఫ్ దా ఇయర్ 2018-2019కు ఏం పికైనా కె. శ్వానిలను గోల్డ్ మెడల్స్తో సత్క రించారు. అండర్ 14 విభాగంలో నేషనల్ క్రికె ట్కు ఎంపికైన కౌశిక్ను అభినందించారు. తమ పాఠశాలలో విద్యా బోధనతో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చి దిద్దుతామని ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్య క్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో కేబీఆర్ ఎ డ్యూకేషన్ సోసైటీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు కె.రాంరెడ్డి, కె.ప్రభావతి, కె.కరుణ, 9వ వార్డు కార్పొరేటర్ నిమ్మల సునితాశ్రీకాంత్గౌడ్, పా ఠశాల డీన్ గోధాలక్ష్మి, ప్రిన్సిపాల్, ఏఓ పాల్గొన్నారు.