Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
మొక్కలు మానవ మనుగడకు మూలమని ప్రముఖ వ్యాపారవేత్త మస్తాన్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరధిలోని ఎన్జీవోస్ కాలనీ రోడ్డు నెం.8లో మహిళా సంఘం ఆధ్వర్యంలో 3సెక్టార్లో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరైయ్యారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చూడాలన్నారు. వనస్థలిపురం ప్రాంతం అంటేనే పచ్చదనానికి ప్రతీకన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలంటే ఇంట్లో కుటుంబ సభ్యులంతా మొక్కలు నాటాలన్నారు. కాలనీవాసులు వర్థిని, ఆదిల్పాషా పాల్గొన్నారు.