Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మూడుచింతలపల్లి/తూంకుంట:
అన్నదాతలు ప్రధానమంత్రి క్రెడిట్ కార్డులను సద్వినియోగించుకోవాలని ఏఈఓ సుప్రజా తెజస్వీని రైతులకు సూచించారు. మూడుచింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్, లింగాపూర్ తండా గ్రామాలలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి సుప్రజా తెజస్వీని పీఎం కిసాన్ క్రెడిట్ కార్డుల జారిపై మంగళవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సర్పంచులు సింగం అంజనేయులు, డి.గోపి నాయక్లు హజరయ్యారు. ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ... పిఎం కిసాన్ లబ్ధిపొందుతున్న రైతులు పంట రుణాలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం పంట రుణాలకు ఎలాంటి గ్యారెంటి లేకుండా లక్షా అరవై వేలు, మార్టిగేజ్ ద్వారా మూడు లక్షల రుపాయలు పొందవచ్చని బ్యాంకులో ఎటువంటి అదనపు చార్జీలు తీసుకోరని వివరించారు. రుణం తీసుకున్న రైతులు తమ ఖాతాలను రెగ్యూలర్ చేసుకుని కిసాన్ క్రెడిట్ కార్డులూ పొందవచ్చన్నారు. తమ అవసరాలకు ఈ కార్డు ద్వారా వడ్డిలేని రణాలు పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ క్యాలెండర్ను రైతులతో కలిసి ఏఈఓ అవిష్కరించారు.
శామీర్పేట:రైతులకు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగించుకోవాలని శామీర్పేట ఏఈఓ రవి అన్నారు. మంగళవారం పొన్నాల్ గ్రామ పంచాయతిలోని రైతులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఈఓ రవి మాట్లాడుతూ.. రైతులందరూ రుణం తీసుకొని కిసాన్ క్రెడిట్ కార్డులను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు సంఘం అద్యక్షుడు రత్నంగౌడ్,వార్డు సభ్యుడు ప్రభాకర్,రైతులు పాల్గొన్నారు.