Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మూడుచింతలపల్లి/తూంకుంట:
ప్రభుత్వం పాఠశాలలో నాణ్యమైన విద్యన ందించాలని ఐదో వార్డు కౌన్సిలర్ సింగిరెడ్డి మధు సూధన్రెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధి లోని తూంకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం ప్రధానోపాధ్యాయురాలు వసంతకుమారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆయన బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత మధుసూధన్రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి తన సహకా రాలుంటాయన్నారు. పభుత్వ పాఠశాలలో చదువుకునే నిరుపేద విద్యార్థులుకు యాభై వేల విలువైన బూట్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాజుయాదవ్, రజనీవేణుగోపాల్రెడ్డి, పూజా భరత్ సింగ్, అల్వాల్ సొసైటీ వైస్ చైర్మన్ భాలరాజు, నర్సారెడ్డి, భూపాల్రెడ్డి, గిరి, బాణాల మధుసూధన్రెడ్డి, జనార్ధన్రెడ్డి, ప్రణరు, ప్రభాకర్, అన్నపూర్ణ, పాల్గోన్నారు.