Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని హెల్పింగ్ హర్ట్స్ సొసైటీ అధ్యక్షులు టి.విజరుకుమార్ అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూనగర్లో అశోక చక్ర దివ్యాంగుల, వితంతువు, వయోవృద్దులు, మల్లారెడ్డి ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. ఈ వైద్య శిబిరంలో సాధారణ, గైనాకాలజీ, దంత, కంటి, చిన్న పిల్లలు, ఆర్థోపెడిక్ వంటి వైద్య పరీక్షలు సుమారు 400 మందికి చేసినట్టు తెలిపారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాబురావు, డాక్టర్ సత్యనారాయణ, మహమూద్, పురుషోత్తం, నగేష్, అశోక చక్ర దివ్యాంగుల, వితంతువు, వయోవృద్దుల సంఘం అధ్యక్షులు యేసుబాబు తదితరులు పాల్గొన్నారు.