Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీలకు అనేక లాభాలు చేకూరాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. గాజులరామారం డివిజన్ పీపీనగర్లో ఉర్దూ ఘర్ (షాదీఖానా)కు రూ.16లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం హాజరై ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మైనార్టీలకు ఎన్నడూ లేనంత ప్రాధాన్యతనిచ్చినట్టు తెలిపారు. షాదీముబారక్ వంటి పథకాలు మైనార్టీల కుటుంబాల్లో వెలుగులు నింపాయని వివరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి, డివిజన్ అధ్యక్షులు విజరురామ్రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి నవాబ్, స్థానిక నాయకులు సయ్యద్రషీద్, లాల్మహ్మద్, హుస్సేన్, ఇబ్రహిం, మసూద్, ఇంద్రసేన గుప్త, కస్తూరి బాలరాజు, అజరు గుప్త, మల్లేష్, సుంకరి సాయి ప్రతాప్ పాల్గొన్నారు.
'