Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్రిపోర్టర్
పిల్లల పెంపకంలో తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత అని బీసీ కమిషన్ పూర్వ సభ్యులు డాక్టర్ వకుళాభరణం కృష్ణమో హన్రావు అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికపై మంగళవారం డాక్టర్ ఆర్బీ అంకం రచించిన పిల్లల పెంపకంలో 21 అద్భుత సూత్రాలు గ్రంథావిష్కరణ సభ నిర్వహించారు. ముఖ్య అతిధిగా డాక్టర్ వకుళాభరణం పాల్గొని సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. నేటి ఆధునిక సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బాల్యం నుండే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ భాధ్యతాయుతంగా ఉండాలన్నారు. అతి గారాబంతో పిల్లల పెంపకం దుష్పరి మాణా లకు దారి తీస్తుందన్నారు. అంకం తల్లి దండ్రు లకు 21అద్భుత సూత్రాలను గ్రంథంలో పొందుపరిచారన్నారు. గాన సభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి, సాహితీ వేత్త రమణా వెలమకన్ని, గాయకులు సంపత్ కుమార్ తదితరులు సభలో పాల్గొన్నారు.