Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ అవేకింగ్ (ఆరా) స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల బృందం మంగళవారం తార్నాక డివిజన్ శాంతి నగర్లోని పలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. స్థానికంగా ఉండే చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలతో బృంద సభ్యులు సమావేశమయ్యారు. బాలల హక్కుల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై ఈ సందర్భంగా వారు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు కే భానుమతి,స్టేట్ కోఆర్డినేటర్, అంబేద్కర్ జిల్లా కోఆర్డినేటర్ సుమతి, జిల్లా ఆర్గనైజర్ పీటర్ అంగన్వాడీ టీచర్స్ చంద్రమణి, విజయ కుమారి లక్ష్మీ, బాయి, బాలమణి తదితరులు పాల్గొన్నారు .
సైకాలజిస్టుల నైపుణ్యాభివృద్ధి ధ్యేయంనవతెలంగాణ-నారాయణగూడ
సైకాలజిస్టుల నైపుణ్యాభివృద్ధి ధ్యేయంగా తమ అసోసియేషన్ కృషి చేస్తుందని తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోతుకూరి రామ చందర్ అన్నారు. మంగళవారం హిమాయ త్నగర్లోని సత్యనారాయణరెడ్డి భవన్లో ''మానసిక సమస్యల పరిష్కారం-దృష్టి సాధన'' అనే అంశంపై శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైకాలజిస్టులు, సంఘం సభ్యుల నైపు ణ్యాల పెంపుదలకు సీసీఇ పేరుతో కౌన్సిలింగ్ నందు నిరంతరంగా శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మార్చి-14 నుంచి 15వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు హైదర్గూడలోని సెంట్రల్ పార్క్ హౌటల్లో 'సొల్యూషన్ ఫోకస్డ్ ప్రాక్టీస్' అనే అంశంపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.ఈ శిక్షణ తరగతులలో సైకాలజిస్టులు, సోషల్ వర్కర్స్, ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు ఫోన్ నెంబర్ 9533660938 సంప్రది ంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వెంపటి రాజు, రాష్ట్ర నాయకులు శ్రీపూజా, సుధాకర్, బాలాజీ, అరుణ్ కుమార్, ఆంజనే యులు తదితరులు పాల్గొన్నారు.