Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పంజాగుట్ట
అమీర్పేట్లోని అపరిచిత కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. దోపిడీని అడ్డుకునేందుకు యత్నించిన మహిళపై దాడిచేసి పరారయ్యారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అపరిచిత కాలనీలో పద్మ రఘురాజ్ ఆమె కుమార్తె నందితా కపూర్ మనవరాలు కీర్తిలతో కలిసి నివాసముంటోంది. మంగళవారం తెల్లవారుజామున వారు నిద్రిస్తున్న సమయంలో ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు సుమారు మూడు గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో అలజడి జరుగుతుండడంతో మేల్కొన్న నందిత వీరిని పసిగట్టి దోపిడిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో కోపోద్రిక్తులైన వారు తమ వెంట తెచ్చుకున్న సుత్తితో తలపై దాడి చేశారు. అనంతరం రూ.1500ల నగదు, బంగారం ఎక్కడ దాచోరో చెప్పాలని బెదిరించారు. దీంతో వారు గట్టిగా అరవడంతో దొంగలు పరారయ్యారు. బాధితుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు క్లూస్ టీం, డాగ్స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పశ్చిమ మండలం డీసీపీఏఆర్ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ సిద్ధిఖీ, పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న, సీసీఎస్ అధికారులు పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.