Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మూడుచింతలపల్లి/తూంకుంట
ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శామీర్పేట పోలిస్ స్టేషన్ పరిధిలోని జగన్గూడ అనుబంధం గ్రామం సంపన్బోల్ లో మంగళవారం చోటుచేకుంది. పోలీసులు, కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి జగన్గూడ అనుబంధ గ్రామం సంపనబోల్కు చెందిన కన్నాయి జహంగీర్బాబు (23) ప్రయివేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే సోమవారం ద్విచక్ర వాహనంపై ఉదయం 9గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన జహంగీర్ రాత్రి వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు సత్యనారాయణ, పాపమ్మలు బందువుల ఇండ్లకు ఫోన్ చేసినా ఆచూకి లభించలేదు. దీంతో మరుసటిరోజు ఉదయం జగన్గూడ కాలనీ నుంచి కొల్తూర్ వెళ్ళె దారిలో ఉన్న మటన్ చెరువు అలుగు దగ్గర గానుగ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా అటుగా వెళ్లిన గ్రామస్తులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడికి నలుగురు అన్నదమ్ములున్నారు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించామని పోలిసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ భాస్కర్రావు తెలిపారు.