Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
వేసవి కాలం సందర్భంగా బస్తీల్లో నీటి సమస్యలను పరిష్కరించేందుకు వాటర్వర్క్స్ అధికారులు చర్యలు తీసుకోవాలని హెచ్బీ కాలనీ డివిజన్ కార్పొరేటర్ గొల్లూరిఅంజయ్య అన్నారు.మంగళవారం డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్నగర్, జయశంకర్కాలనీ, న్యూనర్సిం హాకాలనీల ప్రజలతో వాటర్వర్క్స్ అధికారులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో మిషన్ భగీరథ ద్వారా పైపులైన్ వేశామని త్వరలో అన్ని కాలనీలకు నీటి సరఫరా అందిం చేందుకు వాటర్వర్క్స్ అధికారులు చర్యలు తీసుకుం టారన్నారు.వేసవి కాలం సందర్భంగా ఎవరికి ఇబ్బం దులు రాకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో వాటర్ వర్క్స్ డీజీఎం కృష్ణ, పాల్గొన్నారు.
కైలాసగిరి మల్లికార్జున స్వామి ముఖద్వారం ప్రారంభం :కైలాసగిరి మల్లికార్జున స్వామి దేవాలయ ముఖద్వారాన్ని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి, హెచ్బీ కాలనీ కార్పొరేటర్ గొల్లూరిఅంజయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోనే కైలాసగిరి, నవోదయనగర్, రాజీవ్నగర్ ప్రాంతాలను గుర్తించేందుకు మల్లికార్జు నస్వామి దేవాలయం ముఖద్వారం, ల్యాండ్మార్క్గా ఏర్పడిందన్నారు. మహాశివరాత్రి బ్రహ్మౌత్సవాల సంద ర్భంగా వీటిని ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్ర మంలో జలగం వెంకటేష్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.