Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీసర మండల సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చ
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర మండలంలో అక్రమంగా వెలుస్తున్న వెంచర్లపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజాప్రతినిధులు అధికారులపై మండ ిపడ్డారు. మంగళవారం కీసర మండల సర్వసభ్య సమా వేశం ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ అధ్య క్షతన నిర్వాహించారు.మండలంలోని ఆయా గ్రామాల్లో పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా వెలు స్తున్న వెంచర్ల పనులను వెంటనే నిలుపుదల చేయాలని సమా వేశంలో సర్పంచ్లు,ఎంపీటీసీలు అధికారులను ఆదేశిం చారు.ఈ సందర్భంగ వారు మాటా డుతూ..ధర్మారం, కీసరగ్రామాల్లో అంగన్వాడీ భవనాల్లో వసతులు కల్పించా లన్నారు.కళ్యాణలక్ష్మి చెక్ల పంపిణీ విష యంలో అధికారుల సరైన సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. అదే విధంగా కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాగునీరు లేక రోగులు ఇబ్బందులు పడుతు న్నారని మండల వైద్యాధికారి సరిత తెలిపారు. అదే విధంగా గ్రామాల్లో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరి ంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్చైర్మెన్ బెస్తవెంకటేష్, కీసర వైస్ఎంపీపీ జలాల్పురం సత్తిరెడ్డి, కీసర సహకార సొసైటీ చైర్మెన్ రామిడి ప్రభాకర్రెడ్డి, ఎంపీడీఓ శశిరేఖ, కీసర తహసీల్దార్ నాగరాజు ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.