Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్రిపోర్టర్
జనాభా ప్రతిపాధికన రిజర్వేషన్లు రాజకీయాల్లో ప్రధాన్యత వంటి హక్కుల కోసం బంజారాలు పోరాడాల్సివుందని మాజీ మంత్రులు బలరాం నాయక్, రవీందర్ నాయక్ తదితరులు పిలుపునిచ్చారు. రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం ఆల్ ఇండియా బంజార సేవ సంఫ్ు ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాయక్ మాట్లాడుతూ బంజా రహిల్స్లో ప్రస్తుతం ధనవంతుల నివాసమైందని బంజారాల కోసం ప్రభుత్వం భవంతిని నిర్మిస్తున్న మన్నారని అది త్వరితగిన పూర్తి కావాలన్నారు. సేవా లాల్ జయంతిని జాతీయ పండుగా గుర్తించాలని ఆయన కోరారు. బలరాం నాయక్ మాట్లాడుతూ బంజా రాలు భాషా సంస్కృతి కాపాడుకుంటూ పరస్పరం సోదరభావంతో మేలగాలన్నారు. బంజారా నాయకులు గతంలో దేశ భక్తితో పోరాడారని గుర్తు చేశారు. జగన్ నాయక్ మాట్లాడుతూ బంజారాలు రాజకీయ ఆర్థిక చైతన్యం పొందాలని ప్రజాస్వామ్యాంలో సమాన హక్కులు ఉండాలని వాటి కోసం బంజారాలు పోరాడా లన్నారు. ప్రభుత్వ ఉన్నత మాజీ అధికారులు లక్ష్మణ్, రవీందర్ నాయక్, కేటావత్ తారచందు, పేరియ రాందాస్, తదితరులు పాల్గొన్నారు. కార్యనిర్వహక కార్యదర్శి కృష్ణనాయక్ స్వాగతం పలికారు.