Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు సంక్షేమమే కోరుకుంటుందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలిపారు. ఇటీవల జరిగిన ప్రాథమిక వ్వవసాయ సహకార సంఘం ఎన్నికల్లో చైర్మెన్గా గెలుపొందిన మిద్దెల బాల్రెడ్డి , డైరెక్టర్లు మంగళవారం ఎమ్మెల్సీ నివాసంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కలసి ఎమ్మెల్సీ సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసిందని వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా వెన్నంటే ఉంటానని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేస్తూ గెలుపొందిన చైర్మెన్లు, డైరెక్టర్లు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండాలని తెలిపారు.