Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బేగంపేట్
సికింద్రాబాద్ మహంకాళి (బోనాల) ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు భక్తులు కూడా ఎంతో సహకరించారని అభినందనలు తెలిపారు. మం గళవారం మంత్రి మాట్లాడుతూ ప్రతి ఏడాది వేలాది మంది భక్తుల సమక్షంలో ఎంతో ఘనం గా నిర్వహించే బోనాలను ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కేవలం ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో నిర్వహించినట్టు తెలిపారు. సాంప్రదాయ బద్దంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జాతర నిర్వహించిన ఆలయ అధికారులు, పండితులు, ఆలయ కమిటీ సభ్యులు, అందుకు సహకరించిన పోలీసు, జీహెచ్ఎంసీ, విద్యుత్, వైద్యశాఖ, ఆర్అండ్బి తదితర అన్ని శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులకు మంత్రి అభినందనలు తెలిపారు.