Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెప్టెంబర్ 15 రాత్రి కవి, కథకుడు, కార్టూనిస్ట గొట్టిపర్తి యాదగిరిరావు హఠాన్మరణం సాహితీ మిత్రులందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రపంచ మంతటా మరణ మృదంగం మోగిస్తున్న కోవిడ్-19కు బలియై పోయిన యదగిరిరావు 5 సం||ల క్రితం ఆంధ్రాబ్యాంక్ చీఫ్ మేనేజర్గా రిటైరై జీవితంలో రెండవ ఇన్సింగ్సును సాహితీ సృజనతో ఆరంభించాడు.
1970-80ల మధ్య మినీ కవితలూ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించిన యాదగిరిరావు మొట్టమొదట 'అగ్నిపుష్పాలు' అనే కవితా సంకలనంలో తన కవితలతో సాహితీ జీవితం ఆరంభించి వివిధ పత్రికలలో కవితలు ప్రచురించారు. రేడియో నాటికలు కూడా రాశారు.
1980 తర్వాత ఉద్యోగరీత్యా రాష్ట్రంలో వివిధ ప్రదేశాలలో బ్యాంకు ఉద్యోగ నిర్వహణలో కవితా ప్రపంచంలో 'డీ-లింక్' అయి రిటైరయ్యే ముందు హైదరాబాద్కు వచ్చి తిరిగి కవితా ప్రస్థానం ఆరంభించాడు. 31 మినీ కవితలతో 'విస్పోటనం' కవితా సంకలనం ప్రచురించారు. 2012లో 'అలజడి' మినీ కవితల సంకలనాన్ని ఆవిష్కరించాడు. తర్వాత 'అలజడికి' అనే పేర ఆంగ్ల అనువాదాన్ని 'నిశ్శబ్ద యుద్ధం' అనే మరో సంకలనాన్ని వెలువరించాడు.
కవితలతో పాటు కథా రచన కూడా ఆరంభించి చిన్ననాటి నుంచి చిత్ర కళలో ఆసక్తి కలిగి ఉండటాన మూడు సంవత్సరాల కింద కార్టూన్లు వేయడం ఆరంభించి తనని తాను నిరూపించుకున్నాడు. నాలుగు సంవత్సరాల నుంచి 'సోపతి'లో 'పదకేళి' నిర్వహించి ఇప్పటికి 275 పదకేళులు పూర్తి చేశాడు. నవతెలంగాణ నిర్వహించిన కథల పోటిలో రెండుసార్లు బహుమతులు అందుకున్నారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితి నిర్వహించే ప్రతి కార్యక్రమానికి వచ్చిన తన కవితను వినిపించే వారు.
హైదరాబాద్ పాతన నగర రచయితల సంఘం కార్యవర్గ సభ్యునిగా తెలంగాణ కార్టూనిస్టుల సంఘ కార్య నిర్వాహకునిగా సేవలు అందించిన స్నేహశీలి, సున్నిత మనస్కుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు గొట్టిపర్తి యాదగిరిరావుకు ఇది అక్షర నివాళి.
రచయిత, కవి, కార్టూనిస్టు సోపతి పదకేళి నిర్వాహకులు గొట్టిపర్తి యాదగిరి గారికి శ్రద్ధంజాలి...
- సోపతి డెస్క్
- చింతపట్ల సుదర్శన్,
9299809212