Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాతికేళ్ల వయసులో ఎవరైనా ఏంచేస్తారు. తండ్రులు, తాతలు సంపాదించిన ఆస్తులుంటే జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. లేదంటే ఏదో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ ఆరంకెల జీతాన్ని సంపాదిస్తుంటారు. ఇంకా టాలెంటెడ్ అయితే ఒక కంపెనీ పెట్టి దాన్ని విజయపథాన ఎలా నడిపించాలో ఆలోచిస్తుంటారు. కానీ అందుకు భిన్నమైన ఆలోచిస్తాడు డాక్టర్ రితేశ్ మాలిక్.
అందుకే 26ఏళ్ల వయసులోనే 26కు పైగా అంకుర సంస్థలో అడుగుపెట్టి సక్సెస్ను తన ఇంటిపేరుగా మార్చుకు న్నాడు రితేశ్. ఓ డాక్టర్ స్టోరీ ఇది. వత్తి వైద్యమే అయినా ప్రవత్తి మాత్రం స్టార్టప్స్లో పెట్టుబడులు పెట్టడం. చిన్న వయసులోనే అద్భుత విజయాలను సొంతం చేసుకున్న రితేశ్.. ఫోర్బ్స్ 30 ఫైనాన్స్ అండ్ వెంచర్ లిస్ట్ (ఆసియా) 2016 జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు. అంకురం రితేశ్ స్టార్టప్ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మెడిసిన్ చదువుతున్న రోజుల్లోనే స్టార్టప్స్లో పెట్టుబడులు పెట్టడంలో ఆసక్తి పెంచుకున్న ఆయన అందరు విద్యార్థుల్లా క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్లకుండా క్లాసులకు బంక్ కొట్టి 2010 లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో మార్కెటింగ్ సైన్స్ 101 కోర్స్ క్లాసులకు హాజరయ్యారు. సిలికాన్ వ్యాలీలో స్టార్టప్లు ఎందుకు సక్సెస్ అవుతున్నాయో ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. 2012లో రితేశ్ కెరీర్లో బిగ్టర్న్ అనే చెప్పాలి. తను పెట్టుబడులు పెట్టిన యాడిస్ట్రక్ కంపెనీని టైమ్స్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయడంతో నమ్మకం రెట్టింపు అయింది. హార్వర్డ్ యూనివర్సిటీలో మేనేజ్ మెంట్ కోర్స్ పూర్తి చేశాడు. హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఆంట్రప్రెన్యూర్ షిప్, ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్, సోషల్ ఆంట్రప్రెన్యూర్ సిప్, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో రితేశ్ బహుముఖ ప్రజ్ఞాశాలి.
2013లో తన స్టార్టప్ కెరీయర్ను మిత్రులతో కలసి హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడుల కోసం గెరిల్లా వెంచర్ను ప్రారంభిం చాడు. ఈ సంస్థ వియరబుల్ గాడ్జెట్ ఉత్పత్తి సంస్థ ఫిన్ రొబోటిక్స్ సిరీస్ ఏ ఫండను సమీకరించింది. హార్డ్ వేర్ ప్రాడక్ట్ సంస్థ నిధులు సమీకరించడం ఆషామాషీ కాదు. హార్డ్ వేర్ ప్రాడక్ట్ కంపెనీ నిధులు సేకరించడం ఇదే తొలిసారి అని ఫోర్బ్స్ అంటోంది. ఆర్హెచ్ఎల్ విజన్, విగ్జా, యాడ్డాక్, మషంగా, ఫ్లిప్ మోషన్ సహా 26 సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. దేశంలో ఆంట్రప్రెన్యూర్షిప్ వాతావరణాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా పలు కాలేజీల్లో ప్రచారం చేస్తోంది. స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా ప్రచారంలోనూ రితేశ్ యాక్టివ్ గా పనిచేస్తున్నారు. రెండు లక్ష్యాలు... వ్యవస్థపక రంగంలోకి మరింత మంది మహి ళలను తీసుకురావడం, టెక్నాలజీ ద్వారా గ్రామీణ మార్కెట్ అవసరాలను తీర్చడం తన లక్ష్యాలుగా పెట్టుకున్నాడు డా. మాలిక్. ప్రస్తుతం ఆంట్రప్రెన్యూర్ రంగంలో కేవలం తొమ్మిది శాతంగా ఉన్న మహిళల వాటాను వచ్చే ఏడేళ్లలో 45 శాతంకు పెంచాలని టార్గెట్గా పెట్టుకున్నాడు. గ్రామీణ మార్కెట్ ప్రకారం ప్రస్తుతం వ్యవసాయ రంగమే అతి పెద్దది. డబ్బే ముఖ్యం కాదు.. చాలామంది, ముఖ్యంగా డాక్టర్లు 40 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తారు. రితేశ్ మాత్రం ఆ ఏజ్ వచ్చే సరికి తన టార్గెట్ ను రిచ్ కావాలనే పట్టుదలతో ఉన్నాడు. తన స్వప్నాలను సాకారం చేసుకునేందుకు 26 ఏళ్లకే వ్యవస్థాపక రంగంలోకి అడుగు పెట్టాడు. మెడికల్ రంగానికి గుడ్ బై చెప్పినట్టేనా? అంటే లేదంటున్నారాయన. వైద్యరంగం పైనే తనకు తొలి ప్రేమ అని అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే ప్రాక్టీస్ మాత్రం చేయడం లేదు. తండ్రి ప్రారంభించిన రాడిక్స్ హెల్త్ కేర్ హాస్పిటల్ వ్యవహారాలను కూడా రితేశీ పర్యవేక్షి స్తున్నారు. దాన్ని మరింత విస్తరించాలనుకుంటున్నారు. విజయం... పూలపాన్పు కాదు స్టార్టప్ రంగంలోకి అడుగు పెట్టాలని రితేశ్ అనుకోవడానికి కారణం మద్రాస్ ఐఐటీనే. మెడిసిన్ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు ఐఐటీ మద్రాస్ కు వెళ్తుండేవారు. ఆ సమయంలోనే అభిషేక్ శంకర్ను కలిశారు. అప్పుడే అతడితో కలిసి ఓ సంస్థను ప్రారంభించారు. ఆ సమయంలో అభిషేక్ అగ్మెంటెడ్ రియాలిటీలో ఓ ప్రొడక్ట్ ను రూపొందిస్తున్నారు. కొన్ని పేటెంట్లు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఈ అగ్మెంటెడ్ రియాలిటీని హెల్త్ కేర్ రంగంతో అనుసంధానిస్తే బాగుంటుందని రితేశ్ సూచించారు. అలా ప్రపంచంలోని డాక్టర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి గ్రామీణ రంగంలో సర్జరీలకు సరైన గైడెన్స్ ఇప్పించొచ్చని రితేశ్ సూచించారు. ఆ ఐడియా వర్కవుట్ కాలేదు. ఎందుకంటే ఆ వేదికను ఎక్కువమంది ఉపయోగించుకోలేకపోయారు. అంతే కాదు మౌలికవసతులు కూడా అంతంత మాత్రమే కావడంతో ఆ ప్రయోగం విఫలమైంది. తొలి ప్రయోగం విఫలం తర్వాత వారికి 'ఆలైవ్' ఐడియా వచ్చింది. ఈ ఆలోచన ఎంతో మంది మెచ్చుకున్నారు కూడా. ఆలైవ్ స్టార్టప్ ను విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని 26 సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టారు రితేశ్. హార్డ్ వేర్ రంగంలో స్మార్ట్ ఇన్వెస్ట్ మెంట్ అవకాశాల కోసం చూస్తున్న రితేశ్ కోచి స్మార్ట్ విలేజ్కు వెళ్లారు. ఆ స్టార్టప్ గ్రామంలో పది సంస్థలకు పెట్టుబడులొచ్చాయి. అందులో తొమ్మిది మావే అని రితేశ్ గర్వంగా చెప్పుకొచ్చారు. మహిళలకు చేయూత.. ఇన్నోవ్ 8 మహిళా ఆంట్రప్రెన్యూర్లకు అదనపు ఇన్సెంటివ్స్ ఇస్తోంది. దీన్ని ఇన్నోవ్ 84 విమెన్ అని పిలుస్తున్నారు. వ్యవస్థాపక రంగంలో మహిళలు అద్భుతంగా రాణిస్తారన్నది అతని వ్యక్తిగత అభిప్రాయం. అందుకే మహిళ లకు డిస్కౌంట్స్ ఇవ్వాలనుకుంటున్నారు. వారి కోసం ప్రత్యేక విమెన్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తాం అని రితేశ్ చెప్పుకొచ్చారు.
- అనంతోజు మోహన్ కష్ణ