Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానసిక బానిసత్వానికి చరమగీతం స్వేచ్ఛాలోచన అంటారు రచయిత. మూడు భాగాలు గల యా పుస్తకం మూఢ విశ్వాసాల్ని తరిమిగొడుతుంది. 1766లో ఫ్రాన్స్లో క్రైస్తవ మతోన్మాదానికి అమరుడైనాడు 19 సం||రాల డి లాబర్రి. అతనికి ముందు గియార్టనో బ్రూనో (1600) బలైనాడు. బైబిల్కు చర్చిలకు వ్యతిరేకంగా గళమెత్తారు. 1815- 48 మధ్య కాలంలో స్వేచ్చాలోచన సమాఖ్య ఏర్పడింది. దైవ సిద్ధాంతాన్ని వదలి నైతిక విలువల్ని స్థాపించాలన్నాడు ఐన్స్టీన్. సైన్సు పరిశోథనల్లో ఎక్కడా దేవుని అవసరం రాలేదు'' అన్నారు స్టీఫెన్ హాకింగ్. సాదత్ హసన్ మంటో, కొమర్రాజు లక్ష్మణరావు, తాపీధర్మారావు, నండూరి రామమోహనరావు, కొడవటి గంటి కుటుంబరావు, మహీధర నళినీ మోహనరావు, కొడవటి గంటి రోహిణీ ప్రసాద్, గోవింద్ ఫన్సారే, దబోల్కర్, కల్బుర్గి, పి.యం. భార్గవ, గౌరీలంకేష్, ఇంక్విలాబ్, ఐ.వి. శశి, యం.ఎన్.రారు, జెస్టిస్ మార్కండేయ కట్జూ, భీష్మ సహానీ, జార్జి క్లారిన్ లాంటి మేధావుల గురించి వారి కృషి గురించి పరిచయంగా ఎంతో విలువైన వ్యాసాలు రాసారు. అలాగే స్వాముల బాబాల గురించి, చేపమందు గురించి, మతబోధకులపై సైన్స్ రచనల అవసరం, అంతర్జాతీయ దుర్విని ''యోగ'' దినోత్సవం, యోగాను సైన్స్ ఎందుకు అంగీకరించలేదు? డార్విన్ పరిణామ సిద్ధాంతం కళ్ళ ముందే ఉంది. సైన్సు పరిశోధనల్లో దేవుడి అవసరం రాలేదు. ప్రపంచమే ఒక వైజ్ఞానిక కల్పన లాంటి ప్రామాణిక వ్యాసాలు ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. విజ్ఞాన శాస్త్రం అందించే లాభాల్ని అందరూ అందుకుంటూ
ఉంటారు. కాని దాని గూర్చి తెలుసుకోవాలంటే చాలా మందికి భయం - బెరుకు, విముఖత కనిపిస్తూ
ఉంటాయి. అందుకే ప్రత్యేకించి సైన్సు రచయితలు పుట్టుకొచ్చారు. అటు శాస్త్రజ్ఞుడికి ఇటు సామాన్యుడికి మధ్య వారథిలా నిలిచారు. ఈతరం పాఠకులకు రచయిత ఈ పుస్తకంలో ఎన్నో అంశాల్ని వ్యాసరూపంలో విశ్లేషణాత్మకంగా అందించారు. విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవరాజు మహారాజు అర్థ శతాబ్ధంగా 76కి పైగా ప్రామాణిక గ్రంథాలురాసి పాఠకలోకానికి మహోపకారం చేసారు. సమాజంలో హేతుబద్ధత సామాన్యుడిలో శాస్త్రీయ అవగాహన పెరగాలని నిరంతరం తపిస్తున్న దేవరాజు మహారాజు అభినందనీయులు ప్రతి ఇంట, ప్రతి విద్యార్ధుని వద్ద ఉండాల్సిన గొప్ప పుస్తకం ప్రచురించిన నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ కృషి శ్లాఘినీయం.
(మా నవ వాదం జీవనాధారం, రచయిత : డా|| దేవరాజు మహారాజు, పేజీలు : 240, వెల: రూ.200/-, ప్రతులకు : నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, ఎం.హెచ్ భవన్ - ప్లాట్ -21/1, అజామాబాద్, ఆర్.టి.సి. కళ్యాణ మండపం వద్ద హైదరాబాద్-20. ఫోన్ : 9490099378/373/350)
- తంగిరాల చక్రవర్తి, 9393804472
ద్విపద భాగవతం, రచయిత : మడికి సింగన, పేజీలు : 260, వెల : రూ.125/-, ప్రతులకు : తెలంగాణ సాహిత్య అకాడమి, కళాభవన్, రవీంద్ర భారతి ప్రాంగణం, హైదరాబాద్ - 04, ఫోన్ : 040-29703142.
రామాయణ విశేషములు, రచయిత : సురవం ప్రతాపరెడ్డి, పేజీలు : 280, వెల :రూ. 130/-, ప్రతులకు : తెలంగాణ సాహిత్య అకాడమి, కళాభవన్, రవీంద్ర భారతి ప్రాంగణం, హైదరాబాద్ - 04, ఫోన్ : 040-29703142.
నిజామాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర, రచయిత : డా|| వి.త్రివేణి, పేజీలు : 144, వెల : రూ. 50/-, ప్రతులకు : తెలంగాణ సాహిత్య అకాడమి, కళాభవన్, రవీంద్ర భారతి ప్రాంగణం, హైదరాబాద్ - 04, ఫోన్ : 040-29703142.
సుషుప్తి నుంచి...(కవిత్వం), రచయిత : మామిడి హరికృష్ణ, పేజీలు : 88, వెల : రూ. 150/-, ప్రతులకు : స్వరాజ్యం పబ్లికేషన్స్, మామిడి జయకృష్ణ, 804, రాయల్ పవిలియన్ అపార్ట్మెంట్స్, బిగ్బజార్ ఎదురుగా, ఆర్బిఐ క్వార్టర్స్ వెనుక, అమీర్పేట్, హైదరాబాద్.