Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సైన్స్ వెలుగులు అక్షరీకరించిన కె.బి.గోపాలం
చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించకుండా మనమంతా చీకటిలో బతుకుతున్నాము. శాస్త్రవేత్తలు పంచిన వెలుగులు వాస్తవాలు మనం తెల్సుకోవాలి. సైన్స్ చరిత్రను అక్షర బద్ధం చేసిన ఈ గ్రంథ రచయిత ఎన్నో సైన్సు సంగతులు.. అశేష పాఠక లోకానికి దశాబ్ధాలుగా అందిస్తూనే ఉన్నారు.
ఈ ప్రపంచం లేదా విశ్వం పుట్టినప్పుడే సైన్సు కూడా మొదలైంది. గాలి, నీరు, గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయంటే అదంతా సైన్స్.
జన్యుశాస్త్ర పితామహుడు గ్రెగార్ మెండల్ తన పరిశోధనలను చర్చి ఆవరణలో జరిపాడు. బాబి లోనియన్లు కనుగొన్న ఎన్నో విషయాలను ప్రపంచమంతా వాడుకుంటున్నారు. జ్యోతిష్యం అన్నది ఆధునిక విజ్ఞానంలో భాగం కాదు. నాగరికతలో సైన్స్ కూడా ఒక భాగం. 5000 సంవత్సరాల నాటి నుంచి చైనా, భారతదేశంలో ప్రజలు నగరాలు, పట్టణాలు ఏర్పాటు చేసుకొని జీవించారు. భారతీయ వైద్య గ్రంథాలు క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 600 సం|| మధ్య రాసినవి. పదార్ధ నిర్మాణానికి పంచభూతాలు ఆధారమని భారతీయులు నమ్మారు. నక్షత్ర, సూర్య చంద్రుల కదలికలను భారతీయులు ఖచ్చితమైన లెక్కలు వేశారు. క్రీ.శ. 505లో వరాహమి హరుడు ఈ రంగంలో ఎంతో కృషి చేసాడు. గ్రీకు నాగరికత క్రీ.పూ 600 నాటి నుంచి మొదలయింది. గ్రీకు చరిత్రకారుడు హిరోడోటస్ (క్రీ.పూ. 485-425) థేల్స్ అనే తాత్వికుడు (క్రీ.పూ. 625 - 545) అనాగ్జిమాండర్ (క్రీ.పూ. 611 - 547) క్రీ.పూ 420 నాటి డెమోక్రిటస్, క్రీ.పూ 100 నుండి 55 మధ్య జీవించిన ''లుక్రేటియస్'', క్రీ.పూ. 330 నుండి 260 సంవత్సరాలనాడు జీవించిన ''యూక్లిడ్'', ''ఎరటోస్తనీస్'' (క్రీ.పూ 284 - 192) టాలెవిూ (క్రీ.పూ 100 - 178)ల కృషి మనం తెల్సుకోవాలి. సోక్రటిస్, ప్లేటో, అరిస్టాటిల్ కన్నా ముందు కాలంవాడైన ''హిపోక్రేట్స్'' (క్రీ.పూ. 460)ల సైన్స్, విజ్ఞాన, వైద్య రంగాల కృషి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 1796లో ఎడ్వల్డ్ జెన్నర్ స్మాల్ పాక్స్కు మందు కనుగొనడం జేమ్స్వాట్ ఆవిరి యంత్రం ( 1736 - 1819) కనుగొనడం నీల్స్ బోర్, రూథర్ పోర్ట్ల భౌతిక శాస్త్ర కృషి నుంచి ఐన్స్టీన్ల దాకా వివరించారు రచయిత. కదిలేఖండాల చరిత్ర ఆసక్తి కల్గుస్తుంది. జన్యుశాస్రాన్ని పరిశోధించిన మెండల్ (1822 - 84) కృషి- మానవుల గతంపై పరిశోధనలు .. బాబేజ్ (1792 - 1871) కంప్యూటర్ దాకా విషయాలు .. విశ్వ విజ్ఞాన రహస్యాలు.. సమగ్రంగా అద్భుతంగా అందించిన గొప్ప గ్రంథం ఇది. ప్రతి ఇంటా తప్పక ఉండాల్సిన గ్రంథం రాసిన గోపాలం అభినందనీయులు.
(సైన్స్ వెలుగులు నాటి నుండి నేటి వరకు, రచయిత : కె.బి. గోపాలం, పేజీలు : 328, వెల: రూ.350/-, ప్రతులకు : నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, ఎం.హెచ్ భవన్ - ప్లాట్ -21/1, అజామాబాద్, ఆర్.టి.సి. కళ్యాణ మండపం వద్ధ హైదరాబాద్-20. ఫోన్ : 9490099378/373/350)
- తంగిరాల చక్రవర్తి, 9393804472
లాక్డౌన్ (కవితలు), రచయిత : డా.పత్తిపాక మోహన్, పేజీలు :58, వెల : రూ.75/-, ప్రతులకు : సెక్రటరీ, మానేరు రచయితల సంఘం, 5-4-47, పత్తిపాక వీధి, సిరిసిల్లా - 505301, సెల్ : 9811239219
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రయోగాలు (1952- 2020), రచయిత : డి.వి.వి.ఎస్.శర్మ, పేజీలు :70, వెల : రూ.30/-, ప్రతులకు : డి.వి.వి.ఎస్.శర్మ, 34-20-3, బొమ్మల వీధి, తణుకు - 534211
మిస్టర్ బాలు (నవల), రచయిత : అమ్జద్, పేజీలు : 120, వెల : రూ.100/-, ప్రతులకు :మహమ్మద్ అమ్జద్ అలీ, 11-3-209, రోడ్ నెం.7, శ్రీ వెంకటేశ్వర కాలనీ, సరూర్నగర్ - 35
గడప దాటని యుద్ధం (కరోనా నానీలు), రచయిత : కోట్ల వెంకటేశ్వరరెడ్డి, పేజీలు : 58, వెల : 120, ప్రతులకు :ధ్వని పబ్లికేషన్స్, కవి జనాశ్రయం, 7-5-297, లక్ష్మి నగర్ కాలనీ, మహబూబ్ నగర్- 5909002, సెల్ : 9849444944
యుగపురుషుడు (నవల), కన్నడ మూలం : హెచ్.ఎస్.పార్వతి, అనువాదం : వేలూరి కృష్ణమూర్తి, పేజీలు : 216, వెల : రూ.150, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో..