Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తీస్తా రాసిన ఈ రాజకీయ జ్ఞాపకాలు ఏం జరిగిందో చెప్పే వాంగ్మూలాలు - ఎప్పుడు ఏం జరిగిందో నమోదు చేసిన పత్రాలు. ఆమె ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ఆమెపై అనేక దాడులు జరుగుతున్నప్పటికీ ఏం జరిగిందో చెప్పే తన పోరాటాన్ని ఆమె కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను. అంటూ తీస్తా సెత్లవాద్ పోరాటాన్ని బలపరిచారు రోమిల్లాథాపర్.
బాధితులకు నష్టపరిహారం కోర్టుల నుంచి లభించేలా చేయాలనే తీస్తా సంకల్పం గుజరాత్ మరణహోమంపై ఆమె పోరాటం చాలా గొప్పది. న్యాయపోరాటానికి మద్దతు పలికే చైతన్యం సృష్టించవలసిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం రాజ్యం అదుపాజ్ఞల్లో ఉండే కార్యనిర్వాహక శాఖల అన్యాయాలకు నష్ట పరిహారం కోర్టుల ద్వారా లభించాలన్నది తీస్తా అభిప్రాయం. హింసాకాండల్లో బాధితులు కోల్పోయిన ప్రాణులు, గౌరవ మర్యాదలు, ఆస్తులు, అన్నింటికి నష్ట పరిహారం న్యాయంగా నిజాయితీగా ఇప్పించవలసింది కోర్టులే అంటారు తీస్తా. ఎన్నో కేసులు, పోలీసుల తీరు, మత ఘర్షణలకు అద్దం యా పుస్తకం. ''ది డైలీ'' లో జర్నలిస్ట్గా తీస్తా ప్రవేశంతో ఈ రచన ఆరంభం అవుతుంది. 1983లో మతకలహాల హింసాకాండను అమె కళ్ళారా చూసింది. న్యాయ పోరాటానికి మద్దతు పలికే చైతన్యం సృష్టించాలని ఆమె ఆలోచించింది. 1984లో భోపాల్లోని యూనియన్ కార్భయిడ్ ఫ్యాక్టరీ గ్యాస్లీక్ వల్ల 10వేల మంది మరణించారు. అదే ఏడాది బాంబేలోని భివాండిలో మతకలహాలు జరిగాయి. అలాగే 1992 బాబ్రీ మసీదు ఘటనలో హింసాకాండ నుండి 2002 గుజరాత్ అల్లర్ల దాకా ఘటనలపై తీస్తా పోరాటానికి అక్షరరూపం ఈ గ్రంథం. 1999 నుండి పాఠ్య పుస్తకాల్లో (గుజరాత్) మత విద్వేషం ఎలా చూపించారో తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి జెస్ వర్మ గుజరాత్ హత్యలను సుమోటోగా తీసుకున్నారు. తీస్తా తాత గారు ఎం.సి సెత్లవాద్ ఇండియా మొదటి అటార్నీ జనరల్. ఐ.రా.సలోభారత ప్రభుత్వ స్వరాన్ని బలంగా వినిపించిన వ్యక్తి ఆయన ... నేడు ఆయన మనమరాలు తీస్తా కూడా ప్రజల కోసం పోరాటం చట్ట బద్ధంగా చేస్తోంది. నేటి రాజకీయ కార్యకర్తలకు, వామపక్ష శ్రేయోభిషులకు యా పుస్తకం ఎంతో ప్రయోజనకారి. ''మోడీ'' గుజరాత్ పాలనకు అద్దం పట్టే ఈ పుస్తకం జూలై 2015 దాకా చరిత్రను చూపుతుంది. మోడీ సన్నిహితుల్ని 117 మందిని జైలుకు పంపిన వ్యక్తి తీస్తా మన కాలపు నిజమైన పోరు జ్యోతి విప్లవ నేత - జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన జీవిత చిత్రణే ఈ గ్రంథం.. అబ్దుల్ వాహెద్ అనువాదం చాలా బాగుంది.
(నేనొక నదిని నా పేరు తీస్తా, రచన : తీస్తా సెత్లవాద్, పేజీలు : 224, వెల: 225/- రూ||, ప్రతులకు : నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, ఎం.హెచ్ భవన్ - ప్లాట్ -21/1, అజామాబాద్, ఆర్.టి.సి. కళ్యాణ మండపం వద్ద, హైదరాబాద్-20, ఫోన్ : 9490099378/373/350)
- తంగిరాల చక్రవర్తి, 9393804472
మా బడి కథలు (బాల సాహిత్యం) రచయిత : గరిపెల్ల అశోక్, పేజీలు : 76, వెల : రూ.80/-, ప్రతులకు : గరిపెల్లి సరోజన, 404, విఎల్ఆర్ రెసిడెన్సీ, సిద్ధార్థ స్కూల్ వెనక, శ్రీనివాస నగర్, సిద్ధిపేట - 502 103, ఫోన్ : 9441701088
సమతా వసంత గానం (బౌద్ధ కవిత్వం), రచయిత : నేతల ప్రతాప్ కుమార్, పేజీలు : 80, వెల : రూ.75/-, ప్రతులకు : అని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఎంకటి కతలు (బడి పిల్లల విజయాల కతలు) రచయిత : గరిపెల్ల అశోక్, పేజీలు : 56, వెల : రూ. 80, ప్రతులకు : గరిపెల్లి సరోజన, 404, విఎల్ఆర్ రెసిడెన్సీ, సిద్ధార్థ స్కూల్ వెనక, శ్రీనివాస నగర్, సిద్ధిపేట - 502 103
ఫోన్ : 9441701088
పారిజాతాపహరణము (పరిచయం) రచయిత : బాలాంత్రపు వేంకట రమణ, పేజీలు : 136, వెల : రూ.150/-, ప్రతులకు : బాలాంత్రపు వేంకటరమణ, 105, మీనాక్షి కోర్ట్స్, మేడ్చల్ రోడ్, ఓల్డ్ దివాన్ దాబా వెనక లైను, జీడిమెట్ల విలేజ్, హైదరాబాద్ - 67. సెల్ :
8558899478, 9573170800