Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశవ్యాప్తంగా 29వ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని, 24 డిసెంబర్ 2014వ తేదీన జరుపుకున్నారు. వినియోగదారుల ఉద్యమ ప్రాముఖ్యతను తెలిపి, వారి హక్కులు మరియు బాధ్యతల పట్ల చైతన్యం కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ అండ్ యాక్షన్ కమిటి (సిపిఏసి), ఈ రోజున ప్రజలకు ఉచితంగా ఫిర్యాదుల పత్రాలను, సమాచార పత్రాలను, ఇతర వినియోగదారుల హక్కుల సాహిత్యాన్ని పంపిణి చేసింది.
జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం గురించి
భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ వినియోగ దారుల హక్కుల దినోత్సవాన్ని, డిసెంబర్ 24న జరుపుకుం టారు. వినియోగదారుల రక్షణ చట్టం, 1986ను 24 డిసెంబర్ 1986న అమల్లోకి తెచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
వినియోగదారుల రక్షణ చట్టం గురించి
- వినియోగదారుల రక్షణ చట్టంను, వినియోగదారుల హక్కులను సంరక్షించే ఉద్దేశ్యంతో వారి హక్కులను కాపాడటం కోసం శాసనం ద్వారా ఆమోదించారు.
- ఈ చట్టం వినియోగదారులకు అన్ని రకాల మోసాలు మరియు అవకతవకల నుండి రక్షణను కల్పించి పరిష్కార, నివారణ మార్గాల ద్వారా వారికి నష్టపరిహారం అందించడంలో తోడ్పాటును అందిస్తుంది.
- ఈ చట్టం వినియోగదారులకు, ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా త్వరితగతిన న్యాయాన్ని కల్పిస్తుంది
- వినియోగదారుల రక్షణ చట్టం, రైట్ టు సేఫ్టీ, రైట్ టు బి ఇన్ఫామ్డ్, రైట్ టు చూస్ మరియు రైట్ టు బి హెర్డ్ వంటి వినియోగదారుల హక్కుల అభివద్ధి, పరిరక్షణ కోసం పాటుపడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 15 మార్చిన, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుతారు.
చారిత్రక ప్రాముఖ్యం
భారతదేశం 1989 నుంచి మార్చి నెల 15వ తేదీ నాడు జాతీయ వినియోగదారుల దినాన్ని పాటిస్తూ వస్తోంది. ఈ రోజుకు చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. 1962 మార్చి 15వ తేదీ నాడు అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించడం జరిగింది. ఆ సందర్భంగా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ ప్రసంగిస్తూ ''వినియోగదారుకు నాసిరకం ఉత్పత్తులను ఇచ్చినట్లయితే, ధరలు మరీ ప్రియంగా ఉంటే, ఔషధాలు సురక్షితంగా లేకపోతే లేదా గుణహీనంగా ఉంటే, వినియోగదారు పూర్తి సమాచారం తెలుసుకోకుండా ఏదైనా వస్తువును కొనుగోలుకు ఎంపిక చేసుకొంటే- అటువంటప్పుడు డాలర్ తన విలువను కోల్పోయినట్లవుతుంది. వినియోగదారు ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు; దేశ ప్రయోజనం దెబ్బతింటుంది కూడా'' అన్నారు. ఆ రోజున యుఎస్ కాంగ్రెస్లో కెన్నెడీ చేసిన ప్రసంగం ప్రాముఖ్యాన్ని, తత్ఫలితంగా రూపొందిన శాసనాన్ని పరిగణనలోకి తీసుకొన్న కన్జ్యూమర్స్ ఇంటర్ నేషనల్ (సిఐ) 1983 నుంచి ప్రతి సంవత్సరం మార్చినెలలో 15వతేదీని 'ప్రపంచ వినియోగదారు హక్కుల రక్షణ దినం'గా పాటించాలంటూ 1982లో ఒక నిర్ణయం తీసుకుంది. ప్రగతిశీల శాసనాలను ప్రవేశపెట్టడంలో భారతదేశం ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ఓటు వేసే హక్కును మహిళలకు ఇచ్చిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశాలలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. గాంధీ గారు ''మన వాకిట్లోలోకి విచ్చేసే వినియోగదారు ఒక ముఖ్యమైన సందర్శకుడు. అతడు మన మీద ఆధారపడి లేడు. మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాం. మన పనిలో అతడు ఒక అంతరాయం కాదు, మన పని ఉద్దేశమే అతడు. ఆయనకు సేవ చేయడం ద్వారా మనం అతడికి ఏదో మేలు చేస్తున్నట్లు కాదు. తనకు సేవ చేసే అవకాశాన్ని మనకు కల్పించడం ద్వారా అతడు మనకు మేలు చేస్తున్నాడు'' అని చెప్పారు.
వినియోగదారుకున్న హక్కులలో ఆరోగ్యదాయకమైన ఆహారం ఒక హక్కుగా 2015 సంవత్సరంలో ప్రపంచ వినియోగదారు హక్కుల దినం (డబ్ల్యుసిఆర్ డి) సందర్భంగా ప్రత్యేకమైన దష్టి పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగానే వినియోగదారులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడంలో వారికి తోడ్పడాలని కన్జ్యూమర్స్ ఇంటర్ నేషనల్ నిర్ణయించింది. వినియోగదారులందరూ కేవలం ఆహార హక్కును మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందే హక్కును కూడా కలిగివున్నారు. అన్ని దేశాలు కట్టుబడి ఉండగల ఏదైనా ఒక ఒడంబడిక అనేది వినియోగదారు లందరికీ ఆరోగ్యవంతమైన ఆహారం సులువుగా లభించే ఏర్పాటు చేయగలగడంతో పాటు మరింత సమానత్వంతో కూడిన, నిలకడ కలిగిన ఆహార వ్యవస్థకు పూచీ పడగలుగుతుంది. ఆహారంతో ముడిపడి ఉండే వ్యాధులు.. స్థూల కాయం, మధుమేహం, గుండె జబ్బు, ఇంకా కొన్ని క్యాన్సర్ లు.. ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో ప్రజారోగ్య సంక్షోభాన్ని సూచించేవే. పొగ తాగడం వల్ల శరీరంపై పడే ప్రతికూల ప్రభావం కన్నా సరైన రీతిలోలేని ఆహారాన్ని తీసుకోవడమనేది ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావమే అధికం. స్థూలకాయులు ప్రపంచ జిడిపిపై చూపుతున్న ప్రభావం యుద్ధ వ్యయం, తుపాకుల హింస, ఉగ్రవాదం వంటివి చూపుతున్న ప్రభావంతో సమానమైందిగా ఉంటోందంటే దీని తీవ్రతను గ్రహించవచ్చును. అనారోగ్యానికి దారితీసే, తక్కువ ధరలకు దొరికే ఆహార పదార్థాలు, బడా అంతర్జాతీయ ఆహార కంపెనీల మార్కెటింగ్ పద్ధతులు, వినియోగదారులకు సరి అయిన సమాచారం అందుబాటులో లేకపోవడం.. ఇవి అన్నీ కలిసి ఆరోగ్యప్రదమైన ఆహారాన్ని ఎంచుకోవడాన్ని కష్టతరంగా మార్చి వేస్తున్నాయి. మనుషుల ఒళ్లు పెరిగిపోతుండడానికి, ఆహార సంబంధిత వ్యాధులకు మూలకారణంగా నిలుస్తున్న అంశాలకు సంబంధించి అంతర్జాతీయ ఏకాభిప్రాయం విస్తతమవుతు న్నప్పటికీ, పారిశ్రామిక రంగం వైపు నుంచి వస్తున్న ప్రతిస్పందన ఆశించిన స్థాయిలో లేదు.
వినియోగదారు హక్కులు
వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల హక్కు అని అర్థం. వ్యాపారంలోని అనుచిత పద్ధతుల బారిన పడకుండా వినియోగదారును కాపాడవలసి వుంటుంది. ఈ హక్కులను గురించి వినియోగదారులు తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. వినియోగదారు హక్కులను రక్షించేందుకు భారతదేశంలో బలమైన, స్పష్టమైన చట్టాలు ఉన్నా, దేశంలోని వినియోగదారుల వాస్తవ దురవస్థ అత్యంత నిరుత్సాహకరంగా ఉంది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి అమలవుతున్న వివిధ చట్టాలలో 1986 సంవత్సరంలో వచ్చిన వినియోగదారు రక్షణ చట్టం అత్యంత ముఖ్యమైన చట్టం. ఈ చట్టం ప్రకారం, ప్రతి ఒక్కరు.. వ్యక్తులు, సంస్థ, హిందూ అవిభాజ్య కుటుంబం, కంపెనీ.. వస్తువులను, సేవలను కొనుగోలు చేసేందుకు తమ వినియోగదారు హక్కులను ఉపయోగించే హక్కును కలిగి వున్నారు. ఒక వినియోగదారుగా తన మౌలిక హక్కులను గురించి, న్యాయస్థానాలను గురించి, హక్కుల అతిక్రమణ తదుపరి అమలు కావలసిన విధానాలను గురించి కూడా తెలుసుకోవలసివుంది. వినియోగదారు రక్షణ చట్టం, 1986 దేశంలోని వినియోగదారు రక్షణ/వినియోగదారు ఉద్యమంలో అత్యంత ముఖ్యమనదగిన మైలురాళ్లలో ఒకటి వినియోగదారు రక్షణ చట్టం, 1986కు శాసనరూపాన్ని ఇవ్వడం. వినియోగదారుల కోసం మూడు అంచెలతో కూడిన క్వాసి-జ్యుడీషియల్ కన్జ్యూమర్ డిస్ ప్యూట్ రిడ్రెసల్ మెషినరీని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారు హక్కులను ఉత్తమమైన రీతిలో కాపాడడం కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని కోరే హక్కు 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ (సిఒపిఆర్ఎ) ఆమోదం పొందేందుకు కారణమైంది. దీనిని వినియోగదారుల హక్కుల పత్రం (మాగ్నా కార్టా)గా నిర్వచించడం జరిగింది. అయితే ఇది ఈ హక్కులలోని ఆరు హక్కులను మాత్రమే గుర్తించింది. అవి..
(1). భద్రత
(2). సమాచారం
(3). ఇష్టం
(4). ప్రాతినిధ్యం
(5). సరిదిద్దడం
(6). వినియోగదారు చైతన్యం.
వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడం కోసమే 90 - 150 రోజుల పరిమిత వ్యవధిలో న్యాయనిర్ణయం చేయడానికి/ మధ్యవర్తిత్వం వహించడానికి క్వాసి-జ్యుడీషియల్ కోర్టుల వ్యవస్థకు వీలు కల్పించి విప్లవాత్మకమనదగిన న్యాయ సంబంధ సంస్కరణలను తీసుకురావడంలో సిఒపిఆర్ఎ సఫలమైంది. మౌలిక అవసరాలకు సంబంధించిన హక్కులను, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని సిఒపిఆర్ఎ ద్వారా ఆవిష్కరించడం కుదరలేదు. ఎందుకంటే, ఇవి పేదల, అట్టడుగు వర్గాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీకలు కావడం ఒక కారణం కాగా, ధర చెల్లించితే మార్కెట్లో దొరికే సరుకులు, సేవలకు సంబంధించిన అంశం కాకపోవడం మరొక కారణం. అయితే ఇవి అభివద్ధి చెందిన, అభివద్ధి చెందుతున్న దేశాలలో ప్రజా ఆందోళనలకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం 1986 సంవత్సర వినియోగదారు రక్షణ చట్టానికి శాసన రూపం కల్పించినప్పటికీ, ఆ చట్టం ముఖ్యోద్దేశమైన తక్కువ ఖర్చులో, సులభమైన రీతిలో, సత్వర న్యాయాన్ని అందించడం అనే పరమార్థం ఇప్పటికీ సరిగా నెరవేరలేదు. ఈ సమస్యను చక్కదిద్దడానికి వినియోగదారు రక్షణ చట్టానికి సవరణను ప్రతిపాదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 1986 సంవత్సర వినియోగదారు రక్షణ చట్టంలోని 30వ సెక్షన్ - 1వ సబ్ సెక్షన్లకు అనుసరణగా కేంద్ర ప్రభుత్వం 1987వ సంవత్సర వినియోగదారు రక్షణ నియమావళిని జారీ చేసింది. ఈ నియమావళిలో ఉన్న ముఖ్యమైన నిబంధనలలో - కేంద్ర వినియోగదారు రక్షణ మండలి, కార్యాచరణ ఏర్పాటు (రూల్ 3); బందాల ఏర్పాటు, జిల్లా వేదికకు ఫిర్యాదులు దాఖలు చేయడానికి రుసుమును నిర్దేశించడం (రూల్ 9ఎ); జాతీయ సంఘం, రాష్ట్ర సంఘం, జిల్లా వేదికలకు అదనపు అధికారాలు ధారాదత్తం చేయడం (రూల్ 10) - వంటివి ఉన్నాయి. నిత్యావసర వస్తువులు వినియోగదారులకు సులువుగా అందేటట్లుగా చూడటానికీ, అన్యాయం చేయడానికి వెనుకాడని వ్యాపార వర్గాల దోపిడీ నుంచి వినియోగదారులను రక్షించ టానికీ 1955 సంవత్సర నిత్యవసర వస్తువుల చట్టం ఉండనే ఉంది. నిత్యావసరాలుగా ప్రకటించిన సరుకులఉత్పత్తి, పంపిణీ, ధరల ఖరారులకు సంబంధించి అవలంబించవలసిన విధి విధానాలను ఈ చట్టం నిర్దేశిస్తుంది. అంతేకాకుండా ఆయా సరుకులు న్యాయమైన ధరలలో లభ్యమవుతూ, ప్రజలందరికీ సమానంగా పంపిణీ అయ్యేలా వాటి నిల్వల నిర్వహణ, లేదా సరుకుల సరఫరాలను పెంచడం వంటివి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.
వినియోగదారు వివాదాల పరిష్కార సంస్థలు
వినియోగదారులకు తక్కువ ఖర్చులో, ఇబ్బందులకు తావు లేని రీతిలో, శీఘ్రంగా ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలనే సంకల్పంతో దేశవ్యాప్తంగా వేరు వేరు స్థాయిలలో వినియోగదారు వేదికలను నెలకొల్పడం జరిగింది. వినియోగదారు రక్షణ చట్టంలోని 9వ సెక్షన్ మూడు అంచెల వివాద పరిష్కార సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. అవి ఏమేమిటంటే..
ఎ) కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం. ఈ కోర్టునే జాతీయ సంఘంగా వ్యవహరిస్తారు.
బి) కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్ర వినియోగదారు పరిష్కార సంఘం. ఈ కోర్టునే రాష్ట్ర సంఘంగా కూడా వ్యవహరిస్తారు.
సి) రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసే వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక. ఈ కోర్టునే డిస్ట్రిక్ట్ ఫోరమ్గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏజెన్సీలన్నీ వాటి స్వభావం మరియు అధికారాల పరంగా క్వాసీ- జ్యుడీషియల్ యంత్రాంగంగా పని చేస్తాయి.
వినియోగదారుకు రక్షణ అందించడం
వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులు, అందుకొనే సేవల విషయంలో వారి హక్కులను కాపాడే సాంఘిక, ఆర్థిక ఉద్యమమే వినియోగదారు ఉద్యమం అని చెప్పాలి. వినియోగదారు రక్షణ చట్టాన్ని ఆచరణలో పెట్టే బాధ్యతను వినియోగదారు వ్యవహారాల విభాగానికి అప్పగించారు. వినియోగదారులకు తగిన న్యాయం అందించడానికి కన్జ్యూ మర్ ఫోరాను స్థాపించి వాటిని బలోపేతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలను ఈ విభాగం చేపడుతుంది. జమ్ము కశ్మీర్ ఈ విషయంలో తన సొంత శాసనాన్ని రూపొందిం చుకొంది. వినియోగదారుల శ్రేయస్సును దష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రభుత్వేర సంస్థలతో సంప్రదింపులు జరపడం కూడా వినియోగదారు రక్షణ పరిధిలోకే వస్తుంది. వినియోగదారులకు వారి హక్కులను, బాధ్యతలను తెలియజేయడం, వారి హక్కులను వారు ఉపయోగించుకొనేటట్లుగా వారిలో ప్రేరణను కలిగించడం, వారు కొనే వస్తువులు, సేవల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీకి తావు ఇవ్వకపోవడం, ఏదైనా వివాదం ఏర్పడితే సంబంధిత వినియోగదారు వేదికను ఆశ్రయించడం వంటివన్నీ వినియోగదారు రక్షణ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.
వినియోగదారు ఫిర్యాదుల పరిష్కార విభాగం(సిజిఆర్సి)
వినియోగదారులు అందించే ఫిర్యాదులను పరిష్కరించడా నికి 2002లో కన్జ్యూ మర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ (సిజిఆర్ సి)ను ఏర్పాటుచేశారు. ఉత్పత్తులకు అధిక ధరలను వసూలు చేయడం, లోపం గల వస్తువులను విక్రయించడానికి, ప్రధాన మంత్రి కార్యాలయానికి, కేబినెట్ సెక్రటరీకి అందే ఫిర్యాదులను, వార్తా పత్రికలలో అచ్చయ్యే ఫిర్యాదులను ఈ విభాగం పరిశీలిస్తుంది. దీనికి తోడు, వేరు వేరు రాష్ట్రాలలో, జిల్లాలలో పరిశీలనకు వచ్చిన కేసుల పరిష్కారంలో ఏవైనా జాప్యాలు జరిగితే వాటి విషయంలో తగిన చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా ఫిర్యాదుదారులకు సంతప్తి కలిగించేటట్లుగా వాటిని చక్కబెట్టడంలో తోడ్పడుతుంది.
వినియోగదారు సంక్షేమ నిధి
వినియోగదారు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం సిద్ధించేలా 1944 సంవత్సర సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ ను 1991లో సవరించడం జరిగింది. తయారీదారు సంస్థలకు వాపసు చేయడానికి వీలులేని సొమ్ము, వంటి వాటిని ఈ నిధికి జమ చేస్తారు. వినియోగదారుల సంక్షేమాన్ని పరిరక్షించడానికి, ఈ అంశంలో వినియోగ దారులలో అవగాహనను పెంపొందించడానికి దేశంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో వినియోగదారు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తగిన ఆర్థిక సహాయాన్ని అందించాలనే ధ్యేయంతో 1992లో వినియోగదారు సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. ఈ నిధిని రెవెన్యూ విభాగం 1944 సంవత్సర సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్లో భాగంగా ఏర్పాటు చేసింది. వినియోగదారు వ్యవహారాల విభాగం ఈ నిధిని నిర్వహిస్తోంది.
దేశంలో 70 శాతం కన్నా ఎక్కువ జనాభా 35 సంవత్సరాల కన్న తక్కువ వయస్సు గల యువతతో నిండినది. యువకులు ఇంటర్నెట్ను వివిధ ప్రయోజనాలకు పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. వీరే ప్రధాన వినియోగదారులు కూడా అయ్యారు. దీనిని గ్రహించి, ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా వినియోగదారుల అవగాహనను వ్యాప్తి చేయడాన్ని ఒక ప్రధాన కార్యక్రమంగా చేపట్టడం జరిగింది. అన్నీ ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అన్ని ముద్రణా ప్రకటనలు కూడా అంతర్జాలం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎఫ్సిఎఎంఐఎన్.ఎన్ఐసి.ఐఎన్ (www.fcamin.nic.in)లో అప్లోడ్ చేసారు. వినియోగ దారు హక్కుల కోసం ప్రసార మాధ్యమాలలో ప్రచారం అవసరం. అవసరమైన అన్ని ప్రసార మాధ్యమాల ద్వారా విశాలమైన భారతదేశంలోని వినియోగదారులకు చేరేందుకు గాను దూరదర్శన్, అల్ ఇండియా రేడియో , ఎఫ్ఎమ్ స్టేషన్లు, వార్తాపత్రికలతో సహా ప్రింట్ మీడియా, ప్రకటనలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో వీడియో స్పాట్ లను ప్రసారం చేయడం ద్వారా, మేఘదూత్ పోస్ట్ కార్డులు, ఇంటర్నెట్, బాహ్య ప్రచార సాధనాలు, సంప్రదాయ ప్రచారసాధనాలు (ఎగ్జిబిషన్లు / వాణిజ్య ప్రదర్శనలు, కరపత్రాలు మొదల్కెనవి) ఇంటరెక్టివ్ సీరియళ్లను తెలివిగా ఉపయోగించుకోవాలి.
జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్
వినియోగదారుల ఫిర్యాదులకు స్పందించడానికి ఢిల్లీ విశ్వవిద్యాలయంచే నిర్వహించబడుతున్న, జాతీయ వినియోగ దారుల హెల్ప్ లైన్ను టోల్ ఫ్రీ సంఖ్య 1800-11-4000 ను వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రారంభించింది. అన్ని పని దినాలలో (సోమవారం నుండి శనివారం వరకు) ఉదయం 9 గంటల 30 నిముషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిముషాల వరకు టోల్ఫ్రీ నెంబర్ సౌకర్యాన్ని వినియోగదారులు వినియోగించుకోవచ్చు. అలాగే సాధారణ కాల్ ధరలు వర్తించే హెల్ప్ల్కెన్ 011-27662955-58 కూడా నిర్వహించబడుతుంది.
ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా మార్చి 15 వ తేదీని జరుపుకుంటున్నాం.
- యెనుగందుల శంకర్,
9440747614
నిజామాబాదు ఆరోగ్య విస్తరణ అధికారి