Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వపు దివిటీనెత్తిన మెర్సీ మార్గరేట్'
తూర్పు-ఉదయం, పశ్చిమం -సాయంత్రం లా, యవ్వనం మీదుగా వద్ధాప్యంకు వెళ్తున్న వేళ ఒకానొక సమయాన వెనక్కి మళ్ళి స్వప్నాన్ని కలగంటున్న వాళ్ళ వైపుకు, ప్రేమలు కరువయి పక్కింట్లో జరిగిన సంఘట నను మాధ్యమాల్లో చూసుకోవాల్సి వచ్చిన ఈ తరుణాన అనురాగాన్ని చూపిస్తూ తడిమే చేతుల వైపుకు, బాధలను, గతాలను సమాధి చేస్తూ కొత్త వర్షాన్ని కురిపిస్తూ లోపలి నుండి బయటకు, బయట నుండి లోపలికి తిరిగే పడవ మార్గంలోకి, కొత్త ఉదయపు కిరణాలను నాటుతున్న ఆశలలోకి, కాలం ఎండుటాకుల్లా రాలుతున్నప్పుడు పచ్చబొట్టులాంటి సంతకం చేస్తూ కాలం వైపుకు వాలి పోదామంటున్నది ఈ కవయిత్రి.
మరణానికి, జీవించటానికి ఒక్కసెకనే తేడా, విజయానికి, అపజయానికి ఒక్కసెకనే తేడా అనే విషయం వారివారి అనుభవాల గత స్థితుల్లోంచి, ఎదుటివారి జీవితానుభవ సంఘటనల్లోంచి కొంత నేర్చుకుంటాము. కాలమెప్పుడు మనిషికో కొత్త సిలబస్. అలాంటి కాలం వాలిపోతున్న వైపుకు కవిత్వపు దివిటీని పట్టుకొని వెళ్తుంది ఈ కవయిత్రి.
ఈ కవయిత్రి కవిత్వమంతా ఆధునికతను సంతరించుకొని ఉంటుంది. భాషాపరమైన వైవిధ్యం, సజన ఈ కవయిత్రి అంతర్గత శక్తులు. కొన్ని ఉదాహరణలు చూస్తే..
1. కన్నీటి తడిలో ఖాళీతనపు డెన్సిటీ
2. బూడిద లోంచి మొలకెత్తే ఫీనిక్స్ ఆలాపనలు
3. నాలుగు రోడ్ల కూడలిలో రెడ్ సిగల్ లైట్ లా
వెంటాడే వాక్యాల్లోకి...
1.''అశోకుడు / గౌతముడు / మలాల
నువ్వు ఏదైతేనేం / చెట్టు / అతిపురాతన మహాబోధకుడు'' (చెట్టులిపి ..పేజీ..20)
'చెట్టులిపి' అనే కవితలో కవయిత్రి చెట్టుకు చరిత్రను (ష్ట్రఱర్శీతీy) ఆపాదిస్తుంది. నిజానికి ఎవరికోసం ఎవరూ మారరు. ఒకానొక సందర్భం వ్యక్తుల్లో పరివర్తనకు కారణం. బుద్దుడు భోదివక్షం క్రింద జ్ఞానోదయం పొందుతాడు. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత శాంతికాముకుడై బౌద్ధం తీసుకుంటాడు. మలాల తాలిబన్ ఉగ్రవాదులను ఎదురించి ఆడపిల్లల చదువు కోసం పోరాడిన అమ్మాయి. శాంతి బహుమతిని పొందిన అతి పిన్న వయస్కురాలు. ఈ ముగ్గురి నేపథ్యాలతో కవితను నడిపిస్తూ చెట్టుకు మనిషిని సంస్కరించే గుణముందని తెలుపుతుంది. 'చెట్టు' కవయిత్రి చెప్పినట్టు గొప్ప బోధకుడు.
2. ''ప్రస్తుతం వర్షాన్ని / ఎవరైనా కవిత చేయండి
పుస్తకాల మధ్యదాచి / నగరానికి ఇంత విశ్రాంతినివ్వడానికి
దానికి సీతాకోక రెక్కలు తొడగండి''
(సీతాకోక రెక్కల వర్షం..పేజీ..58)
కొన్ని కవితల్లో 'వస్తు వైవిధ్యం'తో పాటు అభివ్యక్తి ఆశ్చర్య పరుస్తుంది. ఎన్నుకునే వస్తువును వాక్యాల మధ్య సులువుగా కవితాత్మకంగా నిర్మిం చటం ఈ కవయిత్రికి బాగా తెలుసు. వర్షంలో తడవటమంటే ఎవరికి ఇష్టం ఉండదు. నిలువెత్తుగా నిన్ను ముంచే వాన నీకు అక్కర లేనిదే కదా. వర్షంపై విసుగెత్తిన కవయిత్రి ఇక్కన్నుంచి దూరంగా వెళ్తుందన్న ఆశతో సీతాకోక రెక్కలను తొడుగుతుంది.వర్షం ఇక్కడ కవితా వస్తువు.
3. నడక నడకకీ జీవితం / గుణింతాలు నేర్చుకుంటుంది
ఆగిన నడక / గుణింతాలకు కూడిక నేర్పుతుంది
(గుణింతాలకు కూడిక..పేజీ..126)
జీవితం ఆగితే సాగదని మనం ఓ పాటలో విన్నాం. వీలున్నంతవరకు ముందడుగు వేయాల్సిందే. ప్రతి అడుగు ఓ పాఠమవుతుంది. జీవితమంటేనే అడుగులేస్తూ కొనసాగడం. తెలుసుకునే వైపుకు అడుగులేయటం. నేర్చుకోవటం. నడవటం జీవనానికి, ఆగిపోవటం మత్యువుకు ప్రతీకగా కవయిత్రి చెబుతూ నడుచుకుంటూపోతే జీవితాన్ని తెలుసుకుంటాడని, ఆగిపోయినవాన్ని చూసి నడుచుకుంటూ పోయేవాడు కలిసి బతకటమెలాగో తెలుసుకుంటాడని పరోక్షంగా కొన్ని గుణింతాలను ప్రవేశ పెట్టింది.
4. ''సగం చచ్చిన శవాలు రాజకీయం మాట్లాడేటప్పుడు / నల్లధనం సాక్షిగా ఓట్ల చేతులకు
సంకెళ్ళు వేసి / రాజద్రోహమని గొంతుచించుకు అరిచేప్పుడు
రాత్రంతా వీధులూడ్చిన సఫాయికర్మచారిని చేతిలో
కళ్ళు మూతలేయని చీపురు పద్యంలా
గాలి మాట్లాడుతుంది'' (గాలి మాట్లాడుతుంది..పేజీ..186)
ఎవరో ఒకరుమాట్లాడాలి. మాట్లాడకపోతే రాజకీయం చేసేవాడో, సంకెళ్ళు వేసేవాడో మాట్లాడుతుంటే వినుకుంటూ ఊకొట్టాల్సొస్తుంది. ఎప్పుడు మౌనాన్ని పాటిస్తూ కూర్చుంటే ప్రాణం లేని శరీరాలై తిరుగాల్సొస్తుంది.ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న వాళ్ళకో ప్రశ్నగా మారాలంటే మాట్లాడాలి.నువ్వో నేనో మాట్లాడలేని సందర్భంలో మధ్యలో ఏదో కదలిక చేయడానికో కనీసం గాలైనా మాట్లాడుతుందని మాట్లాడలేకపోయేవానికి చురకనంటిస్తుంది ఈ కవయిత్రి.
సుమారుగా 111 కవితలున్న ఈ కవితాసంపుటిలో కవయిత్రి ప్రతీ అంశాన్ని స్పశించారు. కాలం వాలిపోతున్న వైపుకు వాలి నేను కొన్ని విషయాలను ఆకలింపు చేసుకొని ఇక్కడ పొందుపరిచాను.నా గమనింపులో 'కాలం' శీర్షికగా కలిగిన కవితలు మూడు ఉన్నాయి.
1. కాలం వాలిపోతున్న వైపు
2. కాలం వేళ్ళ చివర
3. కాలం గుప్పిట మనుషులు
ఇంతలా కవయిత్రిని కదిలించిన 'కాలం' తన వైపుకు ఓ కవిత్వ దివిటీని ఎత్తేలా చేసుకుంటే ఆ వెలుగుల్లోని కవిత్వపు మెరుపులను వెదజల్లి ఈ కవయిత్రి మనల్ని తన కవిత్వంపై వాలేలా చేస్తూ సీతాకోక రెక్కలను బహుమతిగా ఇస్తుంది. లోనికి వెళ్ళేప్పుడే రెక్కలు పనిచేస్తాయి. అందులో నుంచి బయటపడటం కొంత కష్టమే.
- తండ హరీష్ గౌడ్ 8978439551