Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది 1946 నాటి మాట. యూరప్లో యుద్ధ పీడితులైన బాలబాలికల కోసం యునిసెఫ్ అవతరించింది. 1949లో జకోస్లెవేకియాకి చెందిన 'జిట్కా' అనే ఏడేళ్ళ బాలిక 'దిలైన్ ఆఫ్ చిల్డ్రన్ నీడింగ్ హెల్ ఈజ్ ఎండ్లెస్' అనే టైటిల్తో ఒక పెయింటింగ్ని పంపింది. ఈ బొమ్మని చూశాక యునిసెఫ్ వారికి గ్రీటింగ్ కార్డులను ముద్రించాలనే ఆలోచన వచ్చింది. అలా చిన్నారి జిట్కా చేసిన వినూత్న ప్రయత్నమే గ్రీటింగ్ కార్డుల ఉద్యమానికి ఊపిరి పోసింది. అలా జిట్కా వేసిన బొమ్మే యునిసెఫ్ వారి తొలి గ్రీటింగ్ కార్డుగా ముద్రితమైంది.
'జిట్కా సమకోవా' అనే పూర్తి పేరు గల ఈ చిన్నారి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో తమ గ్రామ ప్రజలకు ప్రాణనష్టం వాటిల్లకుండా కాపాడిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ తనకు తోచినట్లుగా 'శాంతి సమయంలో సంతోషం విరిసిన వేళ' అనే భావనతో వేసిన బొమ్మను చూసిన జిట్కా ఉపాధ్యాయులు 'జోసెఫ్ ఇ బర్టోస్కా' ముచ్చటపడి తన బడిపిల్లలు వేసినవే మరో ఎనిమిది చిత్రాలను కలిపి యునిసెఫ్ వారికి పంపింది. వీటిలో అక్కడి అధికారులు జిట్కా వేసిన చిత్రాన్ని ఎంపిక చేసి తమ సంస్థ క్యాలండర్లో ముద్రించి తమ దేశంలోని అన్ని కార్యాలయాలలో వ్రేలాడదీశారు.
ఇది తెలుసుకున్న యునిసెఫ్ న్యూయార్క్ కార్యాలయం వారు 1949లో జిట్కా బొమ్మని గ్రీటింగ్ కార్డుగా ముద్రించి తమ కార్యాలయంలోని ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండేలా అమ్మకాలు చేశారు. విడుదలైన తొలిరోజే ఈ కార్డులన్నీ అమ్ముడై నాటి నుంచి యునిసెఫ్ డైరెక్టర్ 'మారిన్సెట్'పై కార్డుల ప్రచురణకు వత్తిడి పెరిగింది. దాంతో 1951లో వీటి ముద్రణకై నాలుగు వేల డాలర్లు ఖర్చు చేయడానికి నిర్ణయించారు. ఆ ఏడు ముద్రించిన లక్షా అరవై వేల కార్డులపై 16, 274 డాలర్లు ఆదాయం వచ్చింది. అలా హాట్కేకుల్లా అమ్ముడైన గ్రీటింగ్ కార్డుల ముద్రణకు 1952లో ఒక ప్రత్యేక డైరెక్టర్గా 'నోరా ఎడ్మండ్స్'ని నియమించారు.
కాలక్రమంలో దేశదేశాలలో వుండే ప్రసిద్ధ చిత్రకారుల నుండి పెయింటింగ్స్ని ఆహ్వానించి ముద్రించడం మొదలు పెట్టారు. ఈ యునిసెఫ్ గ్రీటింగ్ కార్డుల ఎంపిక వినూత్నంగా వుంటుంది. మొదటి సంవత్సరం జూన్లో యునిసెఫ్ ఆర్ట్ సెలక్షన్ కమిటీకి అంతర్జాతీయ చిత్రకారులు తమ డిజైనులను అందజేస్తారు. వీటి ఎంపికలో యునిసెఫ్ బాలల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాల అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేసి ముద్రణకు ఆమోదిస్తారు. ఇందుకు రెండేళ్లు పడుతుంది. మూడో సంవత్సరంలో ముద్రించి ప్రపంచ వ్యాప్తంగా నూటనలభై దేశాల్లో విక్రయిస్తారు. వీటిని ఐక్యరాజ్యసమితి గుర్తించిన మూడు అధికార భాషల్లో ముద్రిస్తారు.
యునిసెఫ్ వారి గ్రీటింగ్ కార్డులలో స్త్రీ శిశు సంక్షేమం, కుటుంబం, పిల్లలు, వారి అభివృద్ధి, అక్షరాస్యత, ప్రపంచ శాంతి, సోదరభావం, సాంస్కృతిక వారసత్వాల, పర్యావరణం, మెరుగైన జీవనానికి తోడ్పడే వాతావరణం, యువతరం, మానవ విలువలు, పండుగలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు వంటి విభిన్న అంశాలు ప్రధానంగా చోటుచేసుకుంటాయి. 1992లో 150 మిలియన్ వరకు యునిసెఫ్ గ్రీటింగ్ కార్డులు అమ్ముడైనవి. అదే యేడు మన దేశంలో వీటి అమ్మకం వల్ల మూడు లక్షల నలభై శాతం ఆక్రమించింది. మన దేశానికి చెందిన జెమినీ రారు, భగవాన్ కపూర్, సుల్తాన్ ఆలీ, చుగ్తాయ్, మావలంకర్ వంటి వారి చిత్రాలు యునిసెఫ్ కార్డులుగా ముద్రితమైనవి. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోని మ్యూజియంలలో వీటి నమూనాలు చోటు చేసుకున్నవి.
ఒక చిన్నారి పాప పంపిన చిత్ర సందేశం ప్రపంచ గ్రీటింగ్ కార్డుల చరిత్రనే మలుపు తిప్పింది. ఆమె కృతజ్ఞతలు తెలుపుకున్న విధానం నేడు పెద్ద వ్యాపారమై ప్రపంచాన్ని కుదిపి వేసింది. 150 దేశాల నుండి 2600 మంది చిత్రకారులు తమ చిత్రాలను ముద్రించేందుకు యునిసెఫ్ వారికి హక్కులిస్తున్నారు. వారిలో పికాసో, సెల్సాస్డర్ ఆలి, మార్క్బాగల్, జార్జియా ఓకెఫ్, జీన్ డబుఫెట్ వంటి హేమాహేమీలున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యునిసెఫ్ కార్డులు అమ్మకాల్లో మన దేశం ఆరో స్థానంలో వుంది. మన దేశానికి చెందిన అమర్నాథ్ సెగల్ ''ఫ్లూట్ ప్లేయర్'' చిత్రం న్యూయార్క్ యునిసెఫ్ కార్యాలయంలో ప్రధానంగా కనిపించేలా ప్రదర్శించారు. ఇది భారతీయులందరికీ గర్వకారణం. అయితే వీటి ముద్రణ మాత్రం ఆగిపోకుండా యేటా ముద్రించటం గొప్ప విషయం.