Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూట పదేండ్ల చరిత్రగల తెలుగు కథ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. సకల పార్శ్యాలూ స్పృశిస్తూ 'కోవిడ్-19' కథల సంకలనాన్ని ''ప్రియమైన రచయితుల'' సంఘం ఈ సంకలనాన్ని 39 కథలతో ప్రచురించింది. కథకుడు కవి కార్టూనిస్ట్ కీ.శే. గొట్టికర్తి యాదగిరి రావుకి అంకింత చేశారు ఈ సంకలనాన్ని. జె.ఎస్ మూర్తి. (విహారి) పి.వి. రమణ, చక్కటి ముందు మాటలు రాశారు. అంబల్ల జనార్థన్, నా మని సుజనాదేవి గుండానజోగారావు, వడవి రాధాకృష్ణ, పురిమిళ్ల సునంద యిమ్మిడి శెట్టి చక్రపాణి, అవేరాలాంటి ప్రముఖ కథకుల కథలూ, కొత్త వారి కథలు.... ఈ సంకలనంలో ఉన్నాయి.
మానవీయ సంబంధాలు, సేవాభా వాలు, గ్రామీణ వ్యవసాయ భారతదేశ ప్రాముఖ్యం స్త్రీ పురుషుల సమానత్వం, రోగిని కాదు 'రోగాన్ని' ద్వేషించాలనే సూత్రాన్ని దాదాపు చాలా కథల్లో కనిపిస్తుంది. శైలి, శిల్పాల్ని చూడకుండా వస్తు స్పృహతో ఈ కథలు చదవాలి
కొంచెం పెద్ద కథగా కనిపించినా మంచి కథ 'కరుణ నేర్పిన కరోనా' రచయిత బుద్ధవరపు కామేశ్వరరాఉవ, రామయ్య, లక్ష్మి దంపతుల బిడ్డ శ్యామ్ గారాబంతో పెంచి ఇంజనీరింగ్ చదివించడం, న్యూ జెర్సీలో ఉద్యోగం చేసుకుంటూ అక్కడే పనిచేస్తున్న హారికను పెళ్ళి చేసుకొని జీవిస్తాడు శ్యామ్. ఆస్తి కోసం ఎనిమిది సంవత్సరాల తర్వాత సొంత వూరు ఆళ్ళగడ్డకు వస్తాడు. కరోనా విజృంభణ, తల్లి మృతికి రాకపోవడం , వున్న తండ్రి కూడా ఆస్తి - వ్యవసాయం, బ్యాంక్ డిపాజిట్లు, రామయ్య విల్లు రాసి పంచడం - ఒక్క వ్యవసాయ భూమిని కొడుక్కి అమ్మకుండా అదే భూమిలో సేధ్యం చేయాలని కోరటం, ఈ విషయాలు బాబాయి ద్వారా తెల్సుకున్న శ్యామ్- భార్యకు మెసేజ్ పెట్టి ప్రభుత్వ క్వారంటైన్లో శ్యామ్ గడపడం కథాంశం... వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేలా రామయ్య నిర్ణయం చాలా బాగుంది. కరోనా లాక్డౌన్ ఎందరి జీవితాల్లో చీకట్లు నింపింది. స్కూల్స్ లేక పోవడంతో ఇంట్లో పిల్లల ఆటల కోసం తన దగ్గర ఆటవస్తువుల్ని ప్రణీత్ అనే బాలుడు గుడిశెల్లో ఉండే తన తోటి వారికి అందించాలనే ఆకాంక్షను తన తల్లిదండ్రులు విమల, వివేక్లకుచెప్పి వార్ని కూడా సహాయ కార్యక్రమాల్లోకి మళ్ళించిన చక్కటి కథ 'ఓదార్యం'- రచయిత్రి పురిమళ్ల సునంద అభినందనీయురాలు. మీడియా వాహనంలో చీట్ తిరుగుతున్న సదరు మీడియా బ్యూరోఛీప్ తమ వాహనం అర్థరాత్రి పూట ఆపి లిఫ్ట్ అడిగిన షార్ట్ ఫిలం డైరెక్టర్ చాణక్య - సింగర్ అంజూల్ని ఎక్కించుకుంటాడు. కరోనా నివారణ కార్యక్రమాలకు తాము షార్ట్ ఫిలిం చిత్రిస్తానని , అంజూ పాటలు అందిస్తుందని చెప్పుతారు ఛాణక్య- ఆంజులు చక్కటి కథనం 'ఆడుకున్న నేస్తం' కథ డా|| చక్రపాణి యిమ్మిడి శెట్టి రచన చాలా బాగుంది. విదేశాలకు వెళ్ళి - స్వదేశం వచ్చి కరోనాతో పడిన ఇబ్బందులు... గృహనిర్బంధంలో బాధలు... క్వారంటైన్ కథలు.. స్వదేశం రాలేని విదేశాల్లో ఉద్యోగుల స్థితి... అన్నీ కథల్లో అంతమాత్రంగా కనిపిస్తుంది. అన్నింటిలో చదివించే గుణం ఉంది.
సంకలనం: డా|| ఎస్.వి. రామశర్మ
పేజీలు: 160
వెల: 150/-రూ.
ప్రతులకు : డోనెం: 7-50- శ్రీసాయి
నిలయం, సింహాచలం, విశాఖపట్నం-530028.
- తంగిరాల చక్రవర్తి,
9393804472